Home » West Bengal
పశ్చిమ బెంగాల్లో ‘2016 టీచర్ రిక్రూట్మెంట్’ ద్వారా నియమితులైన 26 వేల మంది ఉద్యోగాలను రద్దు చేస్తూ.. కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం...
పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2016లో చేపట్టిన ప్రభుత్వ ప్రయోజిత, ఎయిడెడ్ పాఠశాలల టీచర్ల నియామకాన్ని కోల్కతా హైకోర్టు సంచలనాత్మక రీతిలో రద్దు చేసింది. చట్టవిరుద్ధంగా నియామకాలు జరిగాయని, మోసపూరితంగా ఖాళీ ఓఎంఆర్ షీట్లు సమర్పించిన అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని హైకోర్ట్ తేల్చింది. ఈ ఆదేశాలతో ఏకంగా 25,753 మంది టీచర్ ఉద్యోగాలను కోల్పోనున్నారు.
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మనుషులతో పాటు మూగ జీవులు సైతం అల్లాడుతున్నాయి. కొన్ని చోట్ల నీరు దొరక్కా జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో బీపీ పెరిగి ఓ యాంకర్ స్పృహ కోల్పోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో(West Bengal) జరిగింది. పాముద్ర సిన్హా దూరదర్శన్లో యాంకర్గా పని చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ( Mamata Banerjee ) ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామనవమి వేడుకల సందర్భంగా బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈద్ సెలబ్రేషన్స్ కోసం బెంగాల్ వచ్చిన వలస కార్మికులు ఓటు వేయకుండా మాత్రం తిరిగి వెళ్లవద్దని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ముర్షీదాబాద్లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం మాట్లాడుతూ, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఓటు వేయని వాళ్ల ఆధార్ కార్డులు, పౌరసత్వాన్ని ఊడ లాక్కుంటుందని హెచ్చరించారు.
పశ్చిమబెంగాల్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో చెదురుమదురు హింసాత్మక సంఘటనలు మినహా లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ చురుకుగా సాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈసీ అందజేసిన వివరాల ప్రకారం, పశ్చిమబెంగాల్లో రికార్డు స్థాయిలో 66.34 శాతం పోలింగ్ నమోదైంది.
పశ్చిమ బెంగాల్లో మొదటి విడత లోక్సభ ఎన్నికలు ( Lok Sabha Elections 2024 ) జరుగుతున్న తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు చోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలతో బెంగాల్ రణరంగాన్ని తలపిస్తోంది.
ముర్షిదాబాద్ ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee )మండిపడ్డారు. ఈ ఘటనకు బీజేపీ నేతలే కారణమని ఆరోపించారు. రాయ్గంజ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె సంచలన కామెంట్లు చేశారు.
శ్రీరామనవమి సందర్బంగా పశ్చిమ బెంగాల్లో ( West Bengal ) నిర్వహించిన రామనవమి ఊరేగింపులో జరిగిన ఘర్షణలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కారణం అని బీజేపీ మండిపడింది. రాష్ట్రంలోని ముర్షిదాబాద్లో బుధవారం రామనవమి ఊరేగింపు జరిగింది
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పర్యటనకు ఎన్నికల కమిషన్ బుధవారంనాడు బ్రేక్ వేసింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు కూచ్బెహర్లో గవర్నర్ తలపెట్టిన పర్యటనను ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది.