Home » West Bengal
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసం, హింస, పోలీసులపై దాడులకు పాల్పడేవారికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గట్టి హెచ్చరిక చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.
తృణమూల్ కాంగ్రెస్లో నెలకొన్న తిరుగుబాటు రాజకీయ దుమారానికి దారితీసింది. ఆ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబె మధ్య సోషల్ వేదికగా మాటల యుద్ధం సాగింది. వివరాల్లోకెళితే...
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉన్న ఒక ప్రభుత్వ భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 4,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
టీఎంసీ తిరుగుబాటు ఎంపీల జాబితాలో తన పేరుందన్న వార్తలను శత్రుఘ్న సిన్హా ఖండించారు. తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తాను తిరుగుబాటు చేయబోనని ఆయన స్పష్టం చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. రాజీనామాల పరంపర కొనసాగుతోంది.
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మంత్రులకు శాఖలు (Portfolios) కేటాయించారు. పలు ఇళ్లల్లో పనిచేస్తూ జీవనోపాధి సాగించి ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన కలితా మాఝీకు మంత్రి పదవి వరించింది.
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ తాజాగా రాజీనామా చేశారు. ఈ వారంలో టీఎంసీకి రాజీనామా చేసిన రాజ్యసభ రెండో ఎంపీగా సుష్మిత నిలిచారు.
సంతకాల ఫోర్జరీకి సంబంధించిన కేసులో తృణమూల్ కాంగ్రెస్కు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఈ కేసు విచారణలో భాగంగా ఖాళీఘాట్లోని టీఎంసీ కార్యాలయానికి సీఐడీ బృందం మంగళవారంనాడు వెళ్లింది. అయితే సీఐడీ టీమ్ను కార్యాలయం ఆవరణలోకి అనుమతించలేదని తెలుస్తోంది.
పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత జహంగీర్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ ఉదయం ఆయన్ని నేపాల్ సరిహద్దుల్లో పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే మదన్ మిత్రాకు చేదు అనుభవం ఎదురైంది. కమార్హాటీ నియోజకవర్గంలోని అరియాదయా ప్రాంతంలో కొంత గందరగోళ పరిస్థితులున్నాయనే సమాచారంతో ఆయన అక్కడకు వెళ్లారు. కొందరు స్థానికులు ఆగ్రహంతో కోడిగుడ్డు విసరడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.