Home » West Bengal
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆమె ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్లకు సంబంధించిన కేసులో, ఈడీ అధికారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అంతేకాదు, ఇలాంటి చర్యలు అరాచకానికి దారితీస్తాయని వ్యాఖ్యానించింది.
టీఎంసీ సంబంధించిన ఎలాంటి డేటాను తాము సీజ్ చేయలేదని కోల్కతా హైకోర్టులో విచారణ సందర్భంగా ఈడీ తెలిపింది. కస్టడీలోకి తీసుకోని సామగ్రిని సురక్షితంగా ఉంచాలనడం ఏమిటని ప్రశ్నించింది.
కోల్కతా హైకోర్టులో కేసు విచారణ వాయిదా పడటంతో భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ను ఈడీ శుక్రవారంనాడు ఆశ్రయించింది. తక్షణ విచారణ కోసం ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరింది.
డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ బుధవారం డౌన్ హిల్ ఫారెస్ట్ ఏరియాలో సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దట్టమైన అడవిలో ఓ అరుదైన నల్ల జింక ఆయనకు కనిపించింది. వెంటనే ఆయన ఫొటోలు, వీడియోలు తీశారు.
పశ్చిమ బెంగాల్లో మహిళల కారణంగా లారీ డ్రైవర్లు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఆ మహిళలు మేకులతో లారీ డ్రైవర్లను భయపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అస్సాం, కేరళ, రాజస్థాన్, తమిళనాడు-పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్కు సీనియర్ పరిశీలకులను ఏఐసీసీ నియమించింది.
ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం ఈసీ అన్నిరకాల తప్పుడు పద్ధతులను అనుసరిస్తోందని బెంగాల్ సీఎం మమత ఆరోపించారు. అర్హులైన వారిని చనిపోయినట్టుగా చూపిస్తోందని.. వృద్ధులు, అనారోగ్యంగా, బలహీనంగా ఉన్నవారిని విచారణకు రావాలని బలవంతం చేస్తూ వేధిస్తోందన్నారు.
ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు మూడు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రిని టీఎంసీ బాస్ బెదిరించారని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర తప్పుపట్టారు. తాము తలుచుకుని ఉంటే మమతా బెనర్జీని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన చోటు నుంచి బయటకు అడుగు పెట్టకుండా చేసేవాళ్లమని అన్నారు.
పధ్నాలుగేళ్ల క్రితం ప్రజలు భయంగుప్పిట్లో ఉన్నప్పుడు తాము బంకురలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, నీటిసంక్షోభాన్ని అధిగమించేందుకు ఎంతో చేశామని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎస్ఐఆర్ పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని బీజేపీని తప్పుపట్టారు.
మమతా బెనర్జీ సర్కార్పై అమిత్షా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించిన కేంద్ర సంక్షేమ పథకాలను బెంగాల్ సీఎం అడ్డుకుంటున్నారని విమర్శించారు.