Home » Weather
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. వరద నీరు పొటెత్తుతుండటంతో పలు ప్రాజెక్ట్ల గేట్లు తెరిచారు. హిమాయత్ సాగర్, శ్రీరాంసాగర్, మూసీ ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం జలాశయాల్లో భారీగా వరద ప్రవహిస్తోంది.
దేశవ్యాప్తంగా మళ్లీ వర్షాల వెదర్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) అప్రమత్తమై పలు రాష్ట్రాల్లో వానలు ముప్పును గుర్తించి రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఉత్తర భారతదేశంలో వర్షాల ప్రభావం పెరిగింది, కొన్ని ప్రాంతాల్లో నదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 10, 11 తేదీల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే మరికొన్ని ఇతర జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. క్యుములోనింబస్ మేఘాల వ్యాపించిన కారణంగా మరికాసేపట్లో కుంభవృష్టి కురిసే అవకాశముందని హెడ్రా హెచ్చరికలు జారీ చేసింది.
Weather Alert: హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. కుండపోత వర్షం కారణంగా నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడం ప్రజల బయటకు రాకూడదని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు పలు కీలక సూచనలు చేశారు. అత్యంత అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు.
హైదరాబాద్ నగరం కుండపోత వర్షంతో తడిసి ముద్దయింది. సిటీలోని పలు కీలక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందలాది మంది విద్యార్థులు, ప్రజలు ఎక్కడివారక్కడ చిక్కుకుపోయారు. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అత్యవసర బృందాలను రంగంలోకి దించాయి.
దేశంలో వర్షాలు మళ్లీ అందరిని తడిపేందుకు సిద్ధమయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికల ప్రకారం, ఈశాన్య భారత్ సహా పలు ప్రాంతాల్లో వచ్చే నాలుగైదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.