Home » Warangal News
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి పోర్టల్లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లకు(ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్) 15 నెలలుగా వేతనాలు లేవు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వీరాభిమాని నిరంజన్ కోరికను గంటల వ్యవధిలోనే నెరవేర్చి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ (17)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. బుధవారం హనుమకొండ, హనుమాన్ నగర్లోని బాలుడి ఇంటికి వెళ్లారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ‘సర్’ పేరుతో ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సర్’పై మనం అప్రమత్తంగా ఉంటే ఏం కాదని చెప్పుకొచ్చారు.
రైతులందరూ ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రసాయనాల వాడకాన్ని తగ్గించకపోతే వ్యవసాయమే ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు.
వర్ధన్నపేట మండలం ఇల్లందలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట జాతీయ రహదారిపై అన్నదాతలు గురువారం ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై సుబేదారి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. హనుమకొండలో బుధవారం ‘రైతు సంగ్రామ సదస్సు’ను బీఆర్ఎస్ నేతలు నిర్వహించారు.
సీఎం రేవంత్రెడ్డి రైతుబంధు బంద్ పెట్టి.. రాహుల్గాంధీకి కప్పం కడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కనపడితే రైతుబంధు ఇంకా ఎప్పుడు ఇస్తారని కాలర్ పట్టుకుని నిలదీయాలని హెచ్చరించారు.
ఒకప్పుడు రాజకీయంగా వెలుగొందిన చేర్యాల ప్రాంతం ఇప్పుడు తన అస్తిత్వం కోసం పోరాడుతోంది.
మిత్రుడి వివాహ విందుకు హాజరై తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.