Home » Vizianagaram
విజయనగరం: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లిమర్లలో ఉదయం 10:15 నుంచి 11:30 గంటల వరకు సభలు నిర్వహిస్తారు.
విజయనగరం: వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. డిప్యూటీ స్పీకర్ కోలగట్లపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్, గాడు అప్పారావు తమ కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు.
Andhrapradesh: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడులో చిన్నారుల వరుస మరణాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. పెత్తందారు ముఖ్యమంత్రికి ఎలాగూ పేదల గోడు పట్టదు... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా చిట్టంపాడు మరణాలపై దృష్టిపెట్టాలన్నారు.
Andhrapradesh: ఎన్టీఆర్కు స్ఫూర్తి గురజాడ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బొబ్బిలిలో నిర్వహించిన రా.. కదలిరా సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. రా.. కదలిరా నినాదం ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం అని చెప్పారు. తెలుగు ప్రజలు ఐటీలో తలెత్తుకొని తిరిగేలా చేసిన ఘనత టీడీపీది అని అన్నారు.
విజయనగరం జిల్లా: శృంగవరపుకోటలో వైసీపీ రాజకీయ కోట పగిలింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య రాజకీయ పోరు రోడ్డున పడింది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ‘గో బ్యాక్’ అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. నిజం గెలవాలి కార్యక్రమం పేరుతో మూడు జిల్లాలో భువనేశ్వరని పర్యటించనున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం 11:45 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు.
Andhrapradesh: జిల్లాలో టీడీపీ నవగళం బహిరంగ సభ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్ల కలయికతో రాష్ట్రంలో చీకటి సామ్రాజ్యం అంతం కాబోతుందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు అన్నారు. నవగళం బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాక్షస పాలన, ఫ్యాక్షనిస్టు సాగుతోందన్నారు.
Andhrapradesh: యువగళం ముగింపు సభ ప్రాంగణం మహానాడును తలపిస్తోంది. యువగళం జైత్రయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద నవశకం సభకు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. నవశకం బహిరంగసభ ప్రాంగణం తెలుగుదేశం పార్టీ పెద్దపండుగ మహానాడు తలపిస్తోంది.
Andhrapradesh: యువగళం ముగింపు సభకు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయనగరం రైల్వేస్టేషన్కు వచ్చే రైళ్లలో అనూహ్య జాప్యం నెలకొంది.