Share News

MS Raju: ఆ ముగ్గురి కలయికతో చీకటి సామ్రాజ్యానికి అంతం

ABN , Publish Date - Dec 20 , 2023 | 04:18 PM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్‌ల కలయికతో రాష్ట్రంలో చీకటి సామ్రాజ్యం అంతం కాబోతుందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు అన్నారు. నవగళం బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాక్షస పాలన, ఫ్యాక్షనిస్టు సాగుతోందన్నారు.

MS Raju: ఆ ముగ్గురి కలయికతో చీకటి సామ్రాజ్యానికి అంతం

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్‌ల కలయికతో రాష్ట్రంలో చీకటి సామ్రాజ్యం అంతం కాబోతుందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు అన్నారు. నవగళం బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాక్షస పాలన, ఫ్యాక్షనిస్టు సాగుతోందన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. అరాచకపాలనపై విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు యువగళానికి బ్రహ్మరథం పట్టారన్నారు. యువగళాన్ని ఆపేందుకు వైసీపీ లైసెన్స్‌డ్ గూండాలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా యువనేత ముందుకు కదిలారే తప్ప... ఎక్కడా వెనకడుగు వేయలేదన్నారు. సైకో పాలనలో ప్రజాస్వామ్యయుతమైన పాలన కనుమరుగైందన్నారు. యువగళంతో నారా లోకేష్ జనహృదయనేతగా పేరు తెచ్చుకున్నారని ఎంఎస్ రాజు పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 20 , 2023 | 04:28 PM