YCP: మంత్రి బొత్స బుజ్జగించినా పట్టించుకోని అసమ్మతి నేతలు
ABN , Publish Date - Feb 13 , 2024 | 10:50 AM
విజయనగరం: వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. డిప్యూటీ స్పీకర్ కోలగట్లపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్, గాడు అప్పారావు తమ కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు.
![YCP: మంత్రి బొత్స బుజ్జగించినా పట్టించుకోని అసమ్మతి నేతలు](https://media.andhrajyothy.com/media/2023/20231205/vzm_e1413045eb.jpg)
విజయనగరం: వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. డిప్యూటీ స్పీకర్ కోలగట్లపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్, గాడు అప్పారావు తమ కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు. తర్వాత నేతలు పార్టీకి రాజీనామా లేఖలు పంపారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఎంత బుజ్జగించినా అసమ్మతి నేతలు పట్టించుకోలేదు. గౌరవం, మర్యాద లేని వైసీపీకన్నా తెలుగుదేశం పార్టీ వెయ్యి రెట్లు మిన్న అని వ్యాఖ్యానించారు. ఇంత వరకు వీరభద్రస్వామి దౌర్జన్యాలు, అక్రమాలు భరించామని, ఇక తమ వల్లకాదని నేతలు తేల్చి చెప్పారు. విజయనగరంలో వైసీపీ పతనమైపోతోందని పార్టీ రాష్ట్ర నాయకులకు చెప్పినా ఫలితం లేదన్నారు. ఈ నెల 19వ తేదీన 10 వేల మందితో టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో తెలుగుదేశంలో చేరుతున్నామని పిల్లా విజయకుమార్, అవనాపు విజయ్ ప్రకటించారు.