Share News

YuvaGalam: యువగళం ముగింపు సభకు అడుగడుగునా అవరోధాలు

ABN , Publish Date - Dec 20 , 2023 | 03:09 PM

Andhrapradesh: యువగళం ముగింపు సభకు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయనగరం రైల్వేస్టేషన్‌కు వచ్చే రైళ్లలో అనూహ్య జాప్యం నెలకొంది.

YuvaGalam: యువగళం ముగింపు సభకు అడుగడుగునా అవరోధాలు

విజయనగరం: యువగళం ముగింపు సభకు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయనగరం రైల్వేస్టేషన్‌కు వచ్చే రైళ్లలో అనూహ్య జాప్యం నెలకొంది. ఒంగోలు నుంచి వస్తున్న స్పెషల్ రైలు 6 గంటలు ఆలస్యంగా నడిచింది. అధికారులు పలు స్టేషన్లలో లూప్ లైన్‌లో పడేయడంతోనే జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు విజయనగరంలో దిగిన తరువాత బస్‌లు, ఇతర వాహనాలను అనుమతి లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు నిరసనకు దిగారు. ఆటోల్లో టీడీపీ కార్యకర్తలను తరలిస్తుంటే ఓవర్లోడ్ అని పోలీసులు ఆపుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నడుచుకుంటూ కళ్యాణ మండపాలకు చేరుకంటున్న పరిస్థితి. కార్యకర్తలకు ప్రతి బందకాలపై టీడీపీ నేతల సీరియస్ అవుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 20 , 2023 | 03:09 PM