Home » Visa
చైనీయులకు పర్యాటక వీసాలను పునరుద్ధరించాలని భారత్ నిర్ణయం తీసుకుంది. గల్వాన్ లోయలో 2020లో జరిగిన ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య టూరిస్ట్ వీసా సేవలు నిలిచిపోయాయి.
కెనడా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త. తాజాగా కెనడా ప్రభుత్వం తాత్కాలిక నివాస దరఖాస్తులతో పాటు విజిటర్స్ వీసా, స్టడీ పర్మిట్స్, సూపర్ వీసా ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించింది. వీసా ప్రాసెసింగ్ సమయాన్ని వేగవంతం చేయడంతో, భారతీయ అభ్యర్థులకు వీసా త్వరగా లభిస్తోంది.
ఇమిగ్రేషన్ ప్రయోజనాలను పొందడం కోసం ప్రణాళికాబద్ధంగా కుట్ర పన్నారనే ఆరోపణలపై అమెరికాలో 11 మంది భారతీయ పౌరులను అరెస్టు చేశారు. వారు వీసా మోసానికి కుట్ర పన్నారనే అభియోగం మోపారు.
ఇండియాతో సంబంధాల పునరుద్ధరణ దిశగా తారిఖ్ రెహ్మన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. భారతీయ పౌరులకు వీసా సర్వీసులను ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ శుక్రవారంనాడు పునరుద్ధరించింది.
అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎ్ససీఐఎస్) 2027 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ల షెడ్యూల్ను శనివారం ప్రకటించింది.
హెచ్-1బీ వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టు వార్తలు వెలువడటంతో లబ్ధిదారులు అనేక మంది అయోమయ స్థితిలో పడిపోయారు. దరఖాస్తుల పరిశీలన బ్యాక్లాగ్స్ భారీగా పేరుకుపోవడంతో సాధారణ స్లాట్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. విదేశీ విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఇచ్చే వీసాల విషయంలో ఎన్నో పరిమితులు విధించారు. అలాగే గత ఏడాది కాలంలో ఏకంగా లక్ష వీసాలను అమెరికా రద్దు చేసింది.
భారత్లో వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడిన నేపథ్యంలో హెచ్-1బీ వీసాదారులకు అక్కడి ఇమిగ్రేషన్ లాయర్లు కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఇండియాకు వెళితే వీసా స్టాంపింగ్ ఆలస్యమై చిక్కుల్లో పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
హెచ్-1బీ వీసాల విషయంలో నిబంధనల్ని కఠినతరం చేసేందుకు అమెరికా ప్రభుత్వం మరోసారి చర్యలు చేపట్టింది. ఆ దేశ పౌరుల వాక్ స్వాతంత్ర్యాన్ని సెన్సార్ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. కంటెంట్ మోడరేటర్లు, ఫ్యాక్ట్ చెకర్ల వంటి వీసా దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించాలని, సెన్సార్ అనుమానమున్న దరఖాస్తులను తిరస్కరించాలని అక్కడి రాయబార కార్యాలయ అధికారులకు మెమో జారీచేసింది.
గత ఐదేళ్లల్లో వివిధ దేశాల్లో భారతీయుల డిపోర్టేషన్లకు సంబంధించిన వివరాలకు కేంద్రం తాజాగా వెల్లడించింది. యూకే అత్యధికంగా 170 మందిని భారత్కు తిరిగి పంపించింది. ఇక రష్యా 82 మంది భారతీయులను డిపోర్టు చేసింది.