Home » Virat Kohli
భారత్-న్యూజిలాండ్ జట్లు ఇండోర్ వేదికగా ఆదివారం మూడో వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. అయితే.. ఇటీవల ఇండోర్లో కలుషిత నీరు తాగడం వల్ల పలువురు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గిల్ చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత తొలిసారి వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచాడు. చివరిసారిగా 2021లో విరాట్ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో టాప్-1గా నిలిచాడు.
న్యూజిలాండ్-భారత జట్ల మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్ రాజ్కోట్ వేదికగా జరగనుంది. కాగా ఈ మ్యాచ్లో విరాట్ మరో హాఫ్ సెంచరీ చేస్తే ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో పడనుంది. వరుసగా ఆరు మ్యాచుల్లో అర్ధ శతకాలు బాదిన తొలి భారత బ్యాటర్గా నిలిచే అవకాశముంది.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో సరైన సత్సంబంధాలు లేవంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించారు.
అచ్చం చిన్ననాటి కోహ్లీలా ఉన్న ఓ బాలుడు విరాట్ను కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ అబ్బాయి తనతో విరాట్ ఏం మాట్లాడాడో.. సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. రో-కో ఇద్దరూ తనను చోటా చీకూ అని పిలిచారని తెలిపాడు.
న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 93 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. విరాట్పై అభిమానులకున్న అంచనాల గురించి మాట్లాడాడు.
ఆదివారం వడోదర వేదికగా కివీస్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు చేసి తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. అయినప్పటికీ తన సూపర్ నాక్కి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా విరాట్ నిలకడ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు.
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఈ సూపర్ నాక్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ అవార్డులన్నీ ఏం చేస్తారని వ్యాఖ్యాత అడగ్గా.. కోహ్లీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.
విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికిన అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో తొలి వన్డేకు ముందు భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ విషయంపై మాట్లాడాడు. అతడిని ‘వన్డేలు నిజంగానే ఈజీ ఫార్మాటేనా?’ అని మీడియా ప్రశ్నించగా.. ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
టీమిండియా-న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఆటగాళ్లంతా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కొంత మంది చిన్నారులు వారిని చూడటానికి గ్రౌండ్కు వచ్చారు. ఆ యంగ్ కిడ్స్కు విరాట్ ఆటోగ్రాఫ్లు ఇచ్చాడు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.