Home » Vijayawada News
విజయవాడ నగర ప్రజలకు జిల్లా ఉన్నతాధికారులు కీలక సూచనలు చేశారు. మంగళవారం విజయవాడలో అతి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జిల్లా అధికారులు హెచ్చరించారు.
విజయవాడ బీసెంట్ రోడ్డులో సీఎం పర్యటించారు. చిరు, వీధి వ్యాపారులతో ముచ్చటించారు. జీఎస్టీ సంస్కరణల అనంతరం వారికి కలుగుతున్న ప్రయోజనాల గురించి ఆరా తీశారు.
విజయవాడ ఉత్సవ్లో కార్నివాల్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
గాంధీజీ మనకు సత్యం, అహింస గురించి నేర్పించారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఖాదీ రాట్నంతో భారత్కు గాంధీజీ స్వాతంత్ర్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు.
విమర్శకుల నోర్లు మూయించేలా తక్కువ సమయంలోనే భారీ ఏర్పాట్లు చేశామని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. పున్నమిఘాట్, గొల్లపూడిలో ఎగ్జిబిషన్, తుమ్మలపల్లిలో సంప్రదాయ నృత్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఇంటర్మీడియట్కు వచ్చినప్పడు మంత్రి నారయాణ తనకు బ్రిడ్జి కోర్స్ నేర్పించారని మంత్రి లోకేశ్ తెలిపారు. రాజ్రెడ్డి తనను గైడ్ చేశారని చెప్పారు. ఫీల్డ్లో మంచిగా పనిచేస్తున్న ఉపాద్యాయులతో వారానికి ఒకరితో కుర్చోని మాట్లాడినట్లు పేర్కొన్నారు.
ఆ మధ్య కాలంలో అటవీశాఖ రాష్ట్ర అధికారి ఒకరు హఠాత్తుగా మరణించారు. తాడేపల్లి(Tadepalli)లో ఆయన ఉండేది అద్దె ఇల్లు కావటంతో శవాన్ని అక్కడికి తీసుకురావద్దని ఇంటి యజమాని కరాఖండిగా చెప్పేశారు. దాంతో చేసేది లేక ఆయన భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులు గుంటూరు అటవీశాఖ కార్యాలయం వద్ద ఉంచి అక్కడ నుంచే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
మద్యం బార్ల పాలసీ ఎక్సైజ్ అధికారు ల పాలిట శాపంలా మారిందా అంటే చోటుచేసుకుంటున్న పరిణామాలు అలాగే ఉంటున్నాయి. గతంలో మద్యం వ్యాపారం అంటే పెద్దఎత్తున పోటీ ఉండేది. ప్రభు త్వానికి దరఖాస్తుల రూపంలోనే రూ.కోట్ల తో ఖజానా నిండేది. గతంలో వైన్స్ లైసె న్సుల జారీలోనూ ఇదే పరిస్థితి. అయితే గత నెలలో బార్లకు నోటిఫికేషన్ జారీ చేయగా వ్యాపారుల నుంచి కనీస స్పం దన లేకుండా పోయింది.
Vijayawada: విజయవాడ పెనుమలూరులో దారుణం జరిగింది. 'జై జగన్' అని అనలేదని ఓ బీజేపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు.. గంగాధర్, బొర్రా వెంకట్ దాడి చేసి, డబ్బులు లాక్కొని.. బట్టలు ఊడదీసి అవమానించారు. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తున్నామని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు.