Home » Vallabhaneni Vamsi Mohan
గన్నవరం టీడీపీ కార్యాలయం విద్వంసం కేసులో ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ కిడ్నాప్లో కీలక ఆధారాలు పోలీసులు సంపాదించారు. కోర్టు కంప్లెక్ వద్దకు సత్యవర్ధన్ను తీసుకువచ్చిన వాహనం, అందులో వచ్చిన వంశీ అనుచరుల వివరాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు సేకరించారు. సత్యవర్ధన్ను నగరంలో ఎక్కడెక్కడ తిప్పారనే అంశంపై కూడా సాంకేతిక ఆధారాలు సేకరించారు.
Dola Bala Veeranjaneya Swamy:వైసీపీ నేతలకు మంత్రి బాలవీరాంజనేయస్వామి మాస్ వార్నింగ్ ఇచ్చారు. వారు మారకపోతే తాట తీస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేత వల్లభనేని వంశీ దుశ్చర్యల గురించి మాట్లాడామని తెలిపారు.
కృష్ణలంక పీఎస్లో వల్లభనేని వంశీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటలపాటు వంశీని పోలీసులు ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం వంశీని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్టేషన్ నుంచి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు పోలీస్ స్టేషన్ పక్క గేటు నుంచి వంశీని ఆస్పత్రికి తరలించారు..
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఉచ్చు బిగుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించిన ఫిర్యాదు చేసి.. వెనక్కి తీసుకున్న సత్యవర్థన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విజయవాడకు తీసుకు వచ్చి.. రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.
కిడ్నాప్, బెదిరింపుల కేసులో విజయవాడ పోలీసులు వైసీపీ నేత వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. తన భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంపై వంశీ భార్య స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారు.. పోలీసులపై ఎలాంటి కామెంట్స్ చేశారు.. ఈ కథనంలో తెలుసుకుందాం..
Vallabhaneni Vamsi Arrest : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలో జరిగిన అక్రమ మట్టి తవ్వకాలపై కీలక విషయాలు వెల్లడించి షాక్ ఇచ్చాడు వంశీ.
Vamsi Arrest: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. వంశీ పాపం పండిందని నేతలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టిన బాధితులు ధైర్యంగా బయటకు వస్తున్నారని టీడీపీ నేతలు అన్నారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసులను వెట్ చేయించి.. రూమ్లోకి వెళ్లిన వంశీ తమ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వంశీ తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత 7 నెలలుగా పోలీసులకు చిక్కకుండా అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. అతని కోసం దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎట్టకేవలకు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో వంశీ గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ నిందితుడిగా ఉన్నారు. కొన్ని రోజుల కిందటే వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి వంశీ కోసం గాలిస్తున్నారు. వంశీ ఆచూకీ పోలీసులకే కాదు.. సొంత పార్టీ నేతలకు కూడా తెలియలేదు.