Home » Vallabhaneni Vamsi Mohan
కిడ్నాప్, బెదిరింపుల కేసులో విజయవాడ పోలీసులు వైసీపీ నేత వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. తన భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంపై వంశీ భార్య స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారు.. పోలీసులపై ఎలాంటి కామెంట్స్ చేశారు.. ఈ కథనంలో తెలుసుకుందాం..
Vallabhaneni Vamsi Arrest : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలో జరిగిన అక్రమ మట్టి తవ్వకాలపై కీలక విషయాలు వెల్లడించి షాక్ ఇచ్చాడు వంశీ.
Vamsi Arrest: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. వంశీ పాపం పండిందని నేతలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టిన బాధితులు ధైర్యంగా బయటకు వస్తున్నారని టీడీపీ నేతలు అన్నారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసులను వెట్ చేయించి.. రూమ్లోకి వెళ్లిన వంశీ తమ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వంశీ తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత 7 నెలలుగా పోలీసులకు చిక్కకుండా అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. అతని కోసం దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎట్టకేవలకు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో వంశీ గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ నిందితుడిగా ఉన్నారు. కొన్ని రోజుల కిందటే వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి వంశీ కోసం గాలిస్తున్నారు. వంశీ ఆచూకీ పోలీసులకే కాదు.. సొంత పార్టీ నేతలకు కూడా తెలియలేదు.
వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గురువారం పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. అక్కడి నుంచి అతనిని విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. టీడీపీ కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ అక్రమార్కులు చేసిన, చేస్తున్న మట్టి మాఫియాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా స్వయానా ఓ టీడీపీ మంత్రి అండదండలు అందిస్తున్నారు. బిల్లులు ఇప్పించే దగ్గరి నుంచి, దొంగ రవాణా బిల్లుల జారీ వరకు సకలం మంత్రిగారే స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన గుర్రం నాని.. భవన నిర్మిణ కార్మికులకు నగదు చెల్లింపులు చేయ్యకుండా ఎగకొడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు రహదారిపై ఆందోళనకు దిగారు.
వైసీపీ అధినేత జగన్కు దమ్ముంటే ఇప్పుడు అమెరికా వెళ్లమనండి. ఇక జీవితాంతం ఆయన తిరిగి ఏపీకి రాలేరని తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో అడ్డగోలుగా వాగిన వారంతా జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందేనని బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్ ఇచ్చారు.