Home » Vaibhav Sooryavanshi
రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన అసమాన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే మహా మహా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్ బౌలింగ్లో వీరవిహారం చేశాడు.
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో దూకుడుగా ఆడడం అంత సులభం కాదు. మహామహులే బుమ్రా బౌలింగ్ను ఆచితూచి ఆడతారు. ఇక, ఆస్ట్రేలియా స్పీడ్స్టర్ జాష్ హేజల్వుడ్ కూడా తక్కువ వాడేం కాదు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2026లోనూ అతడి విధ్వంసం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించాడు.
వైభవ్ సూర్యవంశీకి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంఐతో మ్యాచ్లో ఔటయ్యాక.. వైభవ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. హాఫ్ సెంచరీ మిస్ అయిందన్న బాధతో డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లేటప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాడు.
నిన్న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో అలరించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య.. వైభవ్ను దగ్గరకు పిలిచి ప్రత్యేకంగా అభినందించాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. భారత దిగ్గజ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న 18 ఏళ్ల నాటి రికార్డును తాజాగా బ్రేక్ చేశాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. రాజస్థాన్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ బౌలింగ్లో కళ్లు చేదిరే షాట్లు కొట్టాడు.
గువాహటి వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచులో వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన పిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. దీంతో జాతీయ జట్టులోకి అతడిని తీసుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ బీసీసీఐకి ఓ కీలక సూచన చేశాడు.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్ను రికార్డుల వేటను ప్రారంభించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓ రికార్డుతో తన వేటను ఆరంభించాడు. ఈ మ్యాచ్లో ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు.
వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2025కు ముందు ఈ క్రికెటర్ పేరు అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు! కానీ ఐపీఎల్ తర్వాత తన సంచలన ఇన్నింగ్స్, మెరుపు సెంచరీలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఐపీఎల్లో అడుగు పెట్టడంతోనే రికార్డు సృష్టించాడు.