Home » TTD
ఏపీ శాసనమండలి బీఏసీ సమావేశం ఇవాళ (సోమవారం) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది..
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో ఏక సభ్య కమిటీ ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తిరుపతిలో శ్రీవారి భక్తుల వసతి సముదాయాల్లో ఒకటైన శ్రీనివాసం సముదాయ ఆవరణలో భక్తులకు టోకెన్లు జారీ చేసే క్యూలైన్లపై షెల్టర్లు ఏర్పాటు చేయడానికి టీటీడీ టెండర్లు పిలిచింది. గడువు, ప్రక్రియ ముగిశాక టెండర్లను ఆమోదించకుండా పెండింగు పెట్టింది. నాలుగు నెలల తర్వాత టెండర్లు రద్దు చేసింది. దీంతో అసలు టీటీడీ టెండర్లు పిలవడమెందుకు? పిలిచాక రద్దు చేయడమెందుకు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
టీటీడీ కల్తీ లడ్డూ వ్యవహారంపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు స్పందించారు. నెయ్యి తయారీపై జగన్ హయాంలో అవకతవకలు జరిగాయని ధ్వజమెత్తారు..
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి నాణ్యత విషయంలో జగన్ హయాంలో అనుసరించిన విధానాలు, టెండర్లలో జరిగిన అవకతవకలు, నాణ్యత లేని నెయ్యి సరఫరా వంటి అంశాలను సాక్ష్యాధారాలతో సహా శాసనసభలో చర్చించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. తద్వారా గత ప్రభుత్వ పాపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బాలవీరాంజనేయ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ నేతలు.. శ్రీ వేంకటేశ్వర స్వామి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూను కల్తీ చేసిన జగన్కి తిరుపతి పేరు ఎత్తే అర్హత లేదని ధ్వజమెత్తారు..
ఏపీ శాసనమండలిలో వైసీపీ నేతలు చెప్పులు, బూట్లు వేసుకుని వేంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకోవడంపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై న్యాయ నిపుణులతో మాట్లాడానని, స్వామివారి పట్ల అపచారం చేసిన వారికి లీగల్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో వాస్తవాలను వెలికితీసేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఏకసభ్య కమిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్పై వైసీపీ బురదజల్లుతోందని ధ్వజమెత్తారు.