Home » TTD
ఏపీలోని అన్ని ఆలయాలు శోభాయమానంగా ఉన్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. హిందూ ధర్మ ఆచారాలకు అనుగుణంగా సంక్రాంతిని విజయవంతంగా జరుపుకున్నామని మంత్రి వెల్లడించారు.
వైసీపీపై భానుప్రకాశ్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. గోశాల నుంచి గోవిందుడి వరకు వైసీపీ నాయకులు ఆధారాలు సృష్టించి తమపై అపచారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రం, దేశంలో హిందుత్వాన్ని అణగతొక్కాలని జగన్ కుట్ర చేస్తున్నారని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ అండ్ కో.. హిందూ ధార్మిక సంస్థలపై దాడికి కుట్ర చేస్తూ అలజడికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..
కల్తీ నెయ్యి కేసులో నిందితుడిగా ఉన్న డెయిరీ నిపుణుడు విజయభాస్కర్రెడ్డి.. అర్హత లేని డెయిరీలకు సహకరించడం ద్వారా ఆయా సంస్థల నుంచి ఆయన భారీగా లబ్ధి పొందారని సిట్ తెలిపింది.
తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కల్తీ నెయ్యి తయారీ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఈ కేసులో ఏ 34 విజయభాస్కర్ రెడ్డి ఒప్పుకున్నారు.
టీటీడీ బోర్డు సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ రాజీనామా చేయడానికి గల కారణాలను ఆయన వివరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం వేకువ జామున శ్రీవారి ఆలయంలోని పవిత్రమైన వైకుంఠ ద్వారాలను అధికారికంగా మూసేసింది. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాత్రమే ఈ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ దర్శనం భక్తులకు అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు ఈ అపూర్వ దర్శనానికి తరలివచ్చారు.
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రితో ముగియనున్నాయి. గత తొమ్మిది రోజులుగా లక్షలాది మంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం.. వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించింది.
తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద మద్యం బాటిళ్ల కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో వైసీపీ నేతలతోపాటు ఆ పార్టీకి చెందిన మీడియా ప్రతినిధులు కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని పోలీసులు వివరించారు.
వైకుంఠద్వార దర్శనానికి సర్వదర్శన భక్తులు భారీగా తిరుమల చేరుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి ఒకటిన టోకెన్లున్న భక్తులకే దర్శనం కల్పించడంతో రద్దీ మోస్తరుగా కనిపించింది.