Home » Tollywood
తాను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే అని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల క్రితం సైబర్ మోసానికి గురయ్యానని ప్రస్తావించారు.
ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో బుధవారం శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి అయిందని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ట్రోల్స్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నచ్చనివారిని ట్రోల్ చేయడం, ద్వేషించడం సరికాదని అభిమానులకు హితవుపలికారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి తెరపడింది. దీంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై బహిష్కరణను ఎత్తివేస్తున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ప్రముఖ హీరోలు తమ సినిమాల షూటింగ్లను ఏపీలో నిర్వహించాలని సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ సూచించారు. పెద్ద హీరోలు సహా ప్రతి ఒక్క సినీ హీరో తమ సినిమాకు సంబంధించి కనీసం రెండు షెడ్యూళ్లు అయినా ఇక్కడ చేయాలన్నారు.
ప్రముఖ గాయని జానకి మైసూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై సినీ నటులు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు.
రాజు వెడ్స్ రాంబాయి సినిమా హీరో అఖిల్ రాజ్.. డెలివరీ బాయ్ల మధ్య వివాదం ముదురుతోంది. ఈ ఉదయం అఖిల్ రాజ్పై డెలివరీ బాయ్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. అఖిల్ కారుపై కొంతమంది డెలివరీ బాయ్స్ దాడి చేసినట్లు తెలుస్తోంది.
డెలివరీ బాయ్తో వివాదంపై రాజు వెడ్స్ రాంబాయి సినిమా హీరో అఖిల్ రాజ్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో విడుదల చేశారు.
తెలంగాణలో ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.ఈ సినిమా విడుదల నేపథ్యంలో టికెట్ ధరలను 10 రోజుల పాటు పెంచుకునేందుకు ఈ నెల 2వ తేదీన హోంశాఖ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు సినీ పరిశ్రమను మరోసారి కలవరపెడుతూ ‘ఐ బొమ్మ’ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. పైరసీ వెబ్సైట్ల ద్వారా కొత్త సినిమాలను అక్రమంగా విడుదల చేస్తున్నారంటూ ఫిలిం ఛాంబర్ ఆదివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.