Home » Tollywood
తెలుగు సినీ పరిశ్రమను మరోసారి కలవరపెడుతూ ‘ఐ బొమ్మ’ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. పైరసీ వెబ్సైట్ల ద్వారా కొత్త సినిమాలను అక్రమంగా విడుదల చేస్తున్నారంటూ ఫిలిం ఛాంబర్ ఆదివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కియారా అద్వానీ ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో వీరి పెళ్లి జరిగింది. 2025 జులై నెలలో ఈ జంటకు ఓ పాప పుట్టింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కియారా పోస్ట్పార్టమ్ డిప్రెషన్తో అల్లాడిపోయారట
బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ సినీనటి అషురెడ్డి వివాదంలో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితుడు ఎన్నారై ధర్మేంద్రకు అషురెడ్డి పంపినట్లుగా చెబుతున్న ఒక వాయిస్ రికార్డ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఆడియో రికార్డులో సెటిల్మెంట్ ప్రతిపాదనలు, బెదిరింపులు ఉండటం ఈ కేసును మరింత క్లిష్టంగా మార్చినట్లు సమాచారం.
ప్రముఖ నటి అషురెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. ఒకవైపు ఆమె తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించగా, మరోవైపు ఆమె కుటుంబంపై భారీ మోసం ఆరోపణలు నమోదు కావడం కేసును మరింత క్లిష్టంగా మార్చింది.
ప్రముఖ సినీనటి, బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి కేసులో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బాధితుడిగా చెప్పుకొంటున్న ధర్మేంద్ర ఇచ్చిన వివరాల ప్రకారం.. ఈ వ్యవహారం ప్రేమ, డబ్బు లావాదేవీలు, బెదిరింపుల వంటి అంశాల చుట్టూ తిరుగుతోంది.
ప్రముఖ సినీ నటి, బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ను నమ్మించి సుమారు రూ.10 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాయి.
తనపై వస్తున్న ఆరోపణలపై టాలీవుడ్ నటి అషురెడ్డి స్పందించింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆదివారం ఓ స్టోరీ పెట్టింది.
నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడైన సిద్ధార్థ్రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, తెలంగాణ హైకోర్టు దాన్ని రెండేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాల్ చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ్రెడ్డిని ఆదేశించింది.
నెట్ఫ్లిక్స్తో తన కల నిజం కాబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీలో మార్పులు జరిగాయి. సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గద్దర్ పేరుతో ఇస్తున్న ఈ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన ఉత్తేజాన్ని నింపనున్నాయి..