Home » TMC
సార్వత్రిక ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్లో బీజేపీ కేడర్పై అధికార టీఎంసీ శ్రేణులు వరుసగా దాడులకు తెగబడ్డాయి. ఈ దాడులపై బీజేపీ అగ్రనాయకత్వం నలుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ విచారణ కమిటి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుంది. ఆ క్రమంలో విచారణ బృందం ఎదుట బీజేపీ కేడర్ మంగళవారం ఆందోళనకు దిగింది.
లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుకున్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సిద్ధమవుతోంది. నాలుగు స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జూలై 10న ఈ సీట్లలో పోలింగ్ జరుగనుంది.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయింది. 18వ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలట్ ఓట్లు మినహా ఈవీఎంల్లో 65.79 శాతం మేర పోలింగ్ జరిగినట్లు గురువారం సీఈసీ రాజీవ్ కుమార్ వివరించారు.
ఎగ్జిట్ పోల్స్ అంతా అబద్దమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పేర్కొన్నాయి. ఆ సంస్థల నివేదికలను దీదీ తప్పు పట్టారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. జూన్1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. జూన్4న ఓట్లు లెక్కిస్తారు. దీంతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. ఫలితాలకు మూడు రోజుల ముందు ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు.
మరోసారి అధికారంలోకి వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ని భారత్లో కలుపుతామంటూ కేంద్ర హొంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రకటనపై తీవ్ర దుమారం రేగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని లేవనెత్తడం సరికాదని తృణమూల్ కాంగ్రెస్ అంటోంది.
పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి(Mamata Banerjee) వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను తమ్లూక్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ్కి(Abhijit Gangopadhyay) ఎన్నికల సంఘం(EC) శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీచేసింది.
ఇండియా కూటమి విషయంలో తృణమూల్ కాంగ్రె్స(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వరం మారింది. సీట్ల పంపకం అంశంలో కాంగ్రె్సతో వచ్చిన విభేదాల వల్ల ‘ఇండియా’కు దూరంగా ఉన్న ఆమె బుధవారం కూటమికి మద్దతుగా మాట్లాడారు. హుగ్లీ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమత మాట్లాడుతూ.. 400 స్థానాల్లో గెలిచి మళ్లీ అధికారం చేపడతామంటూ బీజేపీ చెబుతున్న మాటలను తోసిపుచ్చారు.
రాజకీయ సంచలనం ఒకరు.. రాచరిక విలక్షణ వారసురాలు మరొకరు. ఒకరు అత్యాధునిక వేషభాషలు, నవీన భావాలకు ప్రతినిధి అయితే, మరొకరు జాతీయ సంప్రదాయాలకు, మూల విలువలకు పెట్టింది పేరు. ఇద్దరు మహిళలు ఎన్నికల బరిలో దిగడం మామూలే అయినా, ఈ ఇద్దరి నేపథ్యాల రీత్యా పశ్చిమబెంగాల్ సరిహద్దు జిల్లా నడియాలోని లోక్సభ స్థానం కృష్ణానగర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పశ్చిమబెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కునల్ ఘోష్ను తొలగించింది. పార్టీ వైఖరికి అనుగుణంగా ఘోష్ అభిప్రాయాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీఎంసీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.