Home » Tirupathi News
శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారంతో కలకలం రేగింది. శుక్రవారం ఉదయం 150వ మెట్టు వద్ద అటవీ ప్రాంతంలోకి చిరుత దాటుతుండగా భక్తులు చూసి భయాందోళనకు గురై కేకలు వేయడంతో పారిపోయింది.
మూడు రోజులపాటు ప్రజలను అవస్థలకు గురిచేసింది. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. వాతావరణ శాఖ హెచ్చరించిన స్థాయిలో తుఫాన్ తీవ్రత లేకున్నా నష్టాన్ని మాత్రం ఓ మాదిరిగా మిగిల్చింది. ఇలా జిల్లాలో మొంథా వల్ల కలిగిన నష్టం రూ.38.21 కోట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు.
పాత సూపర్ లగ్జరీ బస్సులను ఏం చేయాలి? పర్యావరణ హితం.. సంస్థకు లాభదాయకంగా ఎలా మార్చాలి? ‘ఎలక్ట్రిక్ ఏసీ సూపర్ లగ్జరీలు’గా కన్వర్షన్ చేయడమే దీనికి పరిష్కారంగా అధికారులు ఓ నిర్ణయానికొచ్చారు. ఈ ప్రయోగం విజయవంతమైతే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సులు మరిన్ని రోడ్డెక్కనున్నాయి.
పేదలకు చెందాల్సిన ఉచిత రేషన్ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. పాలిష్ చేసి మార్కెట్లో అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనికి చెక్పెట్టే దిశగా ప్రభుత్వం అత్యాధునిక విధానానికి శ్రీకారం చుట్టింది.
ఎస్వీయూలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రత్యేక ఫీజుతో అడ్మిషన్లకు అనుమతించారు. ఈమేరకు ఎంటెక్, ఎంఫార్మసీ, బీఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు అవకాశమేర్పడింది. అర్హత,ఆసక్తి ఉన్న విద్యార్థులు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్ కార్యాలయంలో సంప్రదించాలని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భూపతి నాయుడు ప్రకటనలో తెలిపారు.
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టమని తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. జగన్ హయాంలో కొంతమంది రాజకీయ నేతల అండదండలు చూసుకొని వేంకటేశ్వర స్వామివారి సొమ్ములు కాజేశారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
అలిపిరి కాలిబాటలోని ఎన్ఎస్ టెంపుల్ వద్ద సుమారు తొమ్మిది అడుగుల పొడవైన నాగుపాము శుక్రవారం ఓ దుకాణంలోకి ప్రవేశించింది. దీనిని గుర్తించిన స్థానికులు వెంటనే పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కర్నాయుడికి సమాచారమిచ్చారు.
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అనిత దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు.
టీటీడీ ట్రస్టులో కూడా బంజారాలకు అవకాశం కల్పించాలని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. హాథిరాంజీ బాబా మఠానికి చెందిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఈటల రాజేందర్ ఆరోపించారు.
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో చెన్నైకు చెందిన వ్యక్తులకు అప్పటి తహసీల్దార్ రామాంజనేయులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేష్, వీఆర్వోలు రాఘవేంద్ర, భార్గవ్, గ్రామ సర్వేయర్ వెంకటేష్, వ్యవసాయ/ఉద్యాన ఏంపీఈ పుట్టా పూర్ణచందునాయుడు, కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ పట్టాలు సృష్టించినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.