Home » Tirupathi News
తిరుపతిలో శ్రీవారి భక్తుల వసతి సముదాయాల్లో ఒకటైన శ్రీనివాసం సముదాయ ఆవరణలో భక్తులకు టోకెన్లు జారీ చేసే క్యూలైన్లపై షెల్టర్లు ఏర్పాటు చేయడానికి టీటీడీ టెండర్లు పిలిచింది. గడువు, ప్రక్రియ ముగిశాక టెండర్లను ఆమోదించకుండా పెండింగు పెట్టింది. నాలుగు నెలల తర్వాత టెండర్లు రద్దు చేసింది. దీంతో అసలు టీటీడీ టెండర్లు పిలవడమెందుకు? పిలిచాక రద్దు చేయడమెందుకు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూను కల్తీ చేసిన జగన్కి తిరుపతి పేరు ఎత్తే అర్హత లేదని ధ్వజమెత్తారు..
న్యూటన్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సు తొలిసారిగా ప్రయాణికులను ఎక్కించుకొని తిరుపతి-కాణిపాకం మధ్య రెండు ట్రిప్పులు నడిచింది. పుణెలోని న్యూటన్ సంస్థలో తయారైన ఈ బస్సు రెండు వారాల కిందట తిరుపతికి చేరుకుంది.
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో వాస్తవాలను వెలికితీసేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఏకసభ్య కమిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..
చంద్రబాబు మళ్లీ సీఎం కావడం, పవన్ కల్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని నటుడు చరణ్రాజ్ అన్నారు.
నిజామాబాద్- తిరుపతి మార్గంలో నడుస్తున్న రాయసీమ ఎక్స్ప్రెస్ (12793 నంబర్) రైలుకు బొల్లారం రైల్వే స్టేషన్లో హాల్టింగ్ సదుపాయం కల్పించారు.
శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ శ్రీపాద స్పందించారు. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై శ్రీ సుభుదేంద్ర స్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీవారి ప్రసాదాల నాణ్యతను, పవిత్రతను కాపాడేందుకు టీటీడీ బోర్డు కట్టుబడి ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి కొనుగోలులో పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేశామని ఉద్ఘాటించారు.
శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మాత్రం సంబంధం లేని అంశాలని సభ దృష్టికి తీసుకొచ్చి.. సభలో పెద్ద డ్రామా సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు..
ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది. రెండు ద్విచక్రవాహనాలు అతివేగంగా ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే..