Home » Tirumala
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్పై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యాక కూడా వక్రీకరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న సినీ నిర్మాత బండ్ల గణేశ్ కాలినొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేసి పరామర్శించారు.
సూర్య జయంతిని పురస్కరించుకొని నేడు(ఆదివారం) సప్త వాహనాలపై కోనేటి రాయుడు తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో స్వామివారి వాహన సేవలు ప్రారంభమయ్యాయి. రాత్రి 8 గంటలకు జరిగే చంద్రప్రభ వాహనసేవతో పరిసమాప్తమవుతాయి.
మాఘ శుద్ధ సప్తమి నాడు వచ్చే రథ సప్తమిని సూర్య భగవానుడి జన్మదినంగా జరుపుకుంటారు. రథ సప్తమి రోజున తిరుమలలో సూర్య భగవానుడిని ఆరాధించడం ఎంతో పుణ్యం అని భక్తుల నమ్మకం.
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపట్టామని వెల్లడించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో సీబీఐ తుది ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చగా.. వారిలో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ పూర్తయింది. ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయగా.. సుప్రీం ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది.
ఏపీలోని అన్ని ఆలయాలు శోభాయమానంగా ఉన్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. హిందూ ధర్మ ఆచారాలకు అనుగుణంగా సంక్రాంతిని విజయవంతంగా జరుపుకున్నామని మంత్రి వెల్లడించారు.
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని టాలీవుడు హీరోహీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి, ప్రముఖ నటుడు శివ బాలాజీ తదితరులు దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకున్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని తన సినిమా థియేటర్ నుంచి సినీ నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరుతో తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఇది రాజకీయ యాత్ర కాదని.. దేవుడి మొక్కు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.