Home » Tirumala Tirupathi
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నిత అంశంపై చాలా ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. ఎన్డీడీబీ రిపోర్ట్ సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు.
ఎన్డీబీబీ నివేదిక ఆధారంగానే తాను తిరుమల గురించి మాట్లాడానని ఏపీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకే.. గతంలో సిన్సియర్ అధికారి శ్యామలరావును నియమించామని తెలిపారు..
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి రవిచంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
కల్తీనెయ్యి కాదని వాదించే వైవీ సుబ్బారెడ్డి.. ఆయన పీఏ ఖాతాలోకి ఆ సంస్థలనుంచి కోట్లాది రూపాయలు ఎలా.. ఎందుకు వచ్చాయో ప్రజలకు చెప్పాలి. ఈ వ్యవహారంపై విమర్శలు చేసే వైసీపీ నేతలు జగన్ హిందువని ధైర్యంగా చెప్పగలరా? గత ప్రభుత్వంలో అన్ని రకాల కల్తీలతో కోట్లు దోచుకున్న వైసీపీ నేతలు.. భగవంతుడినీ వదలకపోవడం చాలా బాధాకరం.’
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మరోసారి రాజకీయంగా, పరిపాలనాపరంగా వేడెక్కింది. ఈ సున్నితమైన అంశంపై ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. సర్కార్కి కీలక లేఖ రాయడం ఇప్పుడు ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశమైంది..
టీటీడీ దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి అంశంపై సుప్రీం కోర్టు నియమించిన సిట్.. నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ సమర్పించిందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఫైనల్ చార్జ్ షీట్లో నెయ్యిలో కల్తీ జరిగిందని, కానీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పిందని ప్రస్తావించారు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో తిరుపతి లడ్డూను కల్తీ చేశారని.. ఆ పాపం జగన్ అండ్కోదేనని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి పాపం జగన్దేనని ధ్వజమెత్తారు.
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపట్టామని వెల్లడించారు.
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని టాలీవుడు హీరోహీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి, ప్రముఖ నటుడు శివ బాలాజీ తదితరులు దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకున్నారు.