Home » Thummala Nageswara Rao
రాష్ట్రంలో 8 మేలురకం వరి వంగడాల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ను శనివారం అధికారులు రికార్డ్ చేశారు.
తెలంగాణలో కోటీ యాభై లక్షల టన్నుల ధాన్యం పండించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 75 లక్షల టన్నుల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.
రైతులకు పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేయడం ద్వారా తెలంగాణ ఫర్టిలైజర్ యాప్నకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
ఖమ్మం జిల్లాలోని వి.వెంకటాయపాలెంలో వెటర్నరీ ఆసుపత్రిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. వెంకటాయపాలెం గ్రామానికి జిల్లాలో ఓ చరిత్ర ఉందన్నారు.
అమరుల త్యాగాల పునాదులు మీద తెలంగాణ అవతరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అమరుల త్యాగాల స్పూర్తిగా సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనను అందిస్తున్నామని పేర్కొన్నారు.
రెండేళ్ల కిందట మున్నేరు వరదలకు తీవ్ర నష్టం చవిచూశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో రూ. 690 కోట్లతో ప్రోటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు.
పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం దెబ్బతింటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. పంట వ్యర్థాలను భూమిలో కలియదున్నాలని సూచించిన మంత్రి.. అవశేషాల దహనం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
దేశంలో అన్నిరకాల పంటలను తమ ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. వరిధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. జొన్న, మెుక్కజొన్న కొనుగోళ్లకు నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరాలను వెల్లడించారు.