Home » Thummala Nageswara Rao
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకున్నా రైతాంగానికి చేసిన విధంగానే నేతన్నలను ఆదుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి రూ.874 కోట్ల పాత బకాయిలను విడుదల చేసినట్టు చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఖమ్మం చరిత్ర తెలిపేలా ఖిల్లాపై రోప్వే ఏర్పాటుతో పర్యాటక అభివృద్ధి చెందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పెరుగుతున్న అర్బన్ పాపులేషన్కు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఖమ్మం నగరం పరిశుభ్రంగా విశాలమైన రహదారులు పచ్చదనంతో ఇతర నగరాలకు ఆదర్శంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, రైతు బిడ్డగా తనకు ఎంతో సంతృప్తిగా ఉందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతులకు ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ఆ దిశగా రేవంత్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ పాఠాశాలలతో అన్నికూలల అభివృద్ధికి పునాదులు పడుతున్నాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
ఆయిల్ పామ్ సాగుతో రైతన్నను రాజుగా మార్చడమే తన కలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు నష్టాల బారిన పడకుండా లాభాలు తెచ్చిపెట్టే పంట ఆయిల్ పామ్ అని తుమ్మల చెప్పారు.
మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించిన మూడ్రోజుల రైతు పండుగ విజయవంతం కావడం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అభినందించారు.
గత ఏడాది కాలంగా రాష్ట్రంలో దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం నడుస్తోంది. కానీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రం ‘ప్రజల వద్దకు పోతాం.. ఉద్యమం చేస్తాం.. నిలదీస్తాం’ అంటూ రకరకాల ప్రకటనలు చేస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎక్కువ వరి పండిస్తున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం పదేపదే చెప్పేదని, ఈ వానాకాలం కాళేశ్వరం లేకుండానే ఏ రాష్ట్రంలో పండనంత వరి తెలంగాణలో పండిందని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీతోనే రైతురాజ్యం సాధ్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులకు పదేళ్ళలో బీఆర్ఎస్ పార్టీ చేయని మేలు, పది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ చేసి చూపిందని ఆయన చెప్పారు.
అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్న రైతులకు సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయాన్ని అందించనుంది.