Home » TG Politics
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆగస్టు 6వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నాటికి ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు.
కేసీఆర్ హయాంలో నిరంకుశ వైఖరితో వ్యవహరించారని ఎమ్మెల్సీ, టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని పేర్కొన్నారు.
అమరుల త్యాగాల పునాదులు మీద తెలంగాణ అవతరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అమరుల త్యాగాల స్పూర్తిగా సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనను అందిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
రేవంత్రెడ్డి ప్రభుత్వం.. రైస్ మిల్లర్లతో కుమ్మకైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శించారు. చివరి గింజ వరకు ధాన్యం కొంటానని సీఎం చెప్పారని..మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ని విమర్శిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్ల వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక కొందరు కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి కేటీఆర్పై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లుగా కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం ఆ మాట ఎప్పుడు ఆనలేదని తేల్చిచెప్పారు.
తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ఆదివారం గాంధీభవన్లో సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కమిటీ చర్చిస్తోంది. పాలకుర్తి నియోజకవర్గంలో నెలకొన్న అంతర్గత విభేదాలు, కామారెడ్డి జిల్లా నాయకుల మధ్య తలెత్తిన వివాదాలపై కమిటీ దృష్టి సారించింది.
సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిస్కంలు పెడతామని సీఎం ఎలా అంటున్నారని ప్రశ్నించారు.