Home » TG Politics
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. కానీ ఆది శ్రీనివాస్ వరకు ప్రతిఫలాలు వెళ్ళే పరిస్థితులు కాంగ్రెస్లో లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లు వస్తున్నాయంటే తెలంగాణ బీసీ సమాజం అంత సంబర పడ్డారని గుర్తు చేశారు.
అసెంబ్లీ వాయిదా అనంతరం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్, హరీశ్ రావు సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుచరించాల్సిన వ్యూహంపై వారు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చే సాంప్రదాయం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని లేఖ కూడా రాసినట్లు గుర్తుచేశారు.
అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులు లేదా అంతకు మించి నిర్వహించినా తాము సిద్ధమే అని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా, అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో మాజీమంత్రులు కేటీఆర్, హరీష్రావుతో సహా ఆ పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం ఎర్రవల్లి ఫాం హౌస్లో సమావేశం కానున్నారు. కేసీఆర్తో భేటీలో పలు కీలక అంశాలపై గులాబీ నేతలు చర్చించనున్నారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గోదావరి జలాలు గుండెకాయ అని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని పేర్కొన్నారు. మామ, అల్లుడు ఎన్ని కుట్రలు చేసినా పాపాలు పోవని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు.
వైద్య సేవలు అందించడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలం అయిందని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు. రైతుల ఆవేదనను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం… ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కూడా ఫైయిల్ దని ధ్వజమెత్తారు.
బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదని కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఓటు హక్కును హరిస్తోందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని ఉద్ఘాటించారు.
తెలంగాణలో ఓటు చోరీ జరిగితే.. కాంగ్రెస్ ఎనిమిది ఎంపీ సీట్లు కూడా తామే గెలిచే వాళ్లమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ప్రజల ఓట్లతో మహేష్ గౌడ్ ఒక్కసారైనా గెలవాలని ఛాలెంజ్ చేశారు. కర్ణాటక, తెలంగాణలో మీరెలా గెలిచారని బండి సంజయ్ ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప మఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సోమవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి బృందం బిజీ బిజీగా ఉంది.