Home » terrorist
పాకిస్తాన్ ఊహించని విధంగా ఆ దేశంపై భారతదేశం దాడులు చేస్తోంది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత దళాలు దాడులు చేశాయి.
Sindhoor Success: జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం దీటుగా జవాబు ఇస్తోంది. ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేపట్టింది.
UNSC Meeting On Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడికి మాకెలాంటి సంబంధం లేదు. మేమూ ఉగ్రవాద బాధితులమే.. దీని వెనక భారత్ హస్తమే ఉందేమో అని బొంకుతున్న దాయాది దేశానికి ఐక్యరాజ్యసమితి షాకిచ్చింది. పహల్గాం దాడిపై నిర్వహించిన రహస్య సమావేశంలో లష్కరే తోయిబాకు, మీ దేశానికి ఉన్న లింకేంటని సూటిగా ప్రశ్నించింది. దీంతో పాక్ ఏమన్నదంటే..
India-Pakistan Tensions: సరిహద్దుల వద్ద దాయాది దేశంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు కీలక సూచన జారీ చేసింది. మే 7 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలు పౌర రక్షణ మాక్ డ్రిల్లు నిర్వహించాలని ఆదేశించింది. యుద్ధం ఏ క్షణంలోనైనా ముంచుకు రావచ్చనేందుకు ఈ ప్రకటనే నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
India Blocks Pak Politicians Social Media Accounts: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్థాన్పై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. సింధు జలాల ఒప్పందం రద్దుతో అసహనంతో ఇండియాపై విషం కక్కుతున్న వారిపైనా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. దాయాది దేశంలోని రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు, నటులు ఇలా అందరికీ వరసపెట్టి షాకులిస్తోంది.
భారత్ - పాక్ దేశాల మధ్య నియంత్రణ రేఖ ముళ్ల తీగల కంచెలకు ఆవల ఉగ్రవాద లాంచ్ప్యాడ్లు ఉన్నాయి. తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది. ఇది పాకిస్తాన్ దళాల ఆక్రమణలో ఉన్న భారత భూభాగంలోని ప్రాంతం.
పహల్గాం ఉగ్రదాడితో భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్కు సూచనలు వస్తున్నాయి.
తీవ్రవాదంతో పాకిస్థాన్కు గత చరిత్ర ఉన్న విషయం నిజమేనని, ఫలితంగా పాక్ నష్టపోయిందని, ఆ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకుందని బిలావల్ చెప్పారు. అయితే ఇదంతా ముగిసిన అధ్యాయమని, సమస్య పరిష్కారానికి అంతర్గత సంస్కరణలు చేపట్టామని చెప్పారు.
JD Vance: పహల్గాం దాడి తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరు దేశాలకు కీలక సూచన చేశారు.
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడిన మష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశాయి. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రమూకల్లో కొందరూ ఇప్పటికి కశ్మీర్లోనే ఉండి ఉంటారని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.