Home » terror attack
మురళీ నాయక్ సైనికుడైన ఆత్మకు అనేక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. సైనిక కుటుంబానికి ఆర్థిక సహాయం, స్థలం, ఉద్యోగాలు ఇచ్చే హామీతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు
PM Modi PoK Statement: అంతర్జాతీయ సమాజానికి, పాకిస్థాన్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దు వద్ద దాడులను సహించదని.. పాక్ ఆక్రమిత కశ్మీర్ అప్పగింతపై తప్ప మరో అంశంపై పొరుగు దేశంతో చర్చించబోమని తేల్చిచెప్పారు.
ఆపరేషన్ సిందూర్లో భారత్ ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను హతమార్చింది. కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి కూడా వీరిలో ఒకడు కావడం గమనార్హం.
Operation Bunyan Un Marsoos: 'ఆపరేషన్ సిందూర్'కు ప్రతీకారంగా వరస దాడులకు యత్నించి భారత ఆర్మీ చేతిలో చావు దెబ్బ తింది పాక్. ఇప్పటికే ఆర్థికంగా అథఃపాతాళంలో కూరుకుపోయింది. రేపో మాపో చేతులెత్తేస్తుందని అంతా అనుకుంటుంటే.. ప్రెస్ మీట్ పెట్టి మరీ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి సంచలన ప్రకటన చేశారు.
జమ్ముకశ్మీర్లో పాక్ సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందిన తెలుగు అగ్నివీర్ మురళీ నాయక్ దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు. కన్నతండ్రి ఆశయంగా దేశరక్షణను ఎంచుకున్న మురళికి రాష్ట్ర ప్రభుత్వం, నాయకులు నివాళులు అర్పించారు
వాయిస్, హ్యాండ్ రైటింగ్ నమూలాలు ఇచ్చేందుకు తహవ్వుర్ రాణా పూర్తిగా సహకరించినట్టు ఆయన తరఫు లీగల్ ఎయిడ్ అడ్వకేట్ పీయూష్ సచ్దేవ్ కోర్టుకు తెలిపారు. ఎన్ఐఏ అభ్యర్థ మేరకు రాణా నుంచి ఈ శాంపుల్స్ తీసుకునేందుకు న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ సారథ్యంలోని ఎన్ఐఏ కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత నౌకాదళం అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ను తరలించి, పాకిస్థాన్ పై దాడికి సిద్ధమైంది. ఐఎన్ఎస్ విక్రాంత్, అనేక యుద్ధ నౌకలు, క్షిపణులతో పాకిస్థాన్పై తీవ్ర దాడులు జరిపేందుకు సన్నద్ధమైంది
భారత యుద్ధ విమానాలు పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై సియాడ్ దాడులు నిర్వహించాయి. 25 పైగా డ్రోన్లతో లాహోర్లోని లక్ష్యాన్ని సరిగ్గా గురిపెట్టినట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశంలో ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ తిరిగి క్రియాశీలమయ్యే అవకాశాలు ఉండడంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు తెలిసింది.
Operation Sindoor Pak Stock Market: 'ఆపరేషన్ సిందూర్' ఇంకా కొనసాగుతుందని భారత్ ప్రకటించడంతో గురువారం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు నష్టాలు భారీ పతనాన్ని చవిచూశాయి. అర్ధాంతరంగా ట్రేడింగ్ నిలిపివేశారు.