Home » Telugu Desam Party
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో మాగంటి గోపీనాథ్ భౌతిక కాయం ఉంచారు. ఆస్పత్రి నుంచి మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని ఇంటికి కుటుంబ సభ్యులు తరలించనున్నారు.
పల్లా సింహాచలం సేవలు మరువలేనివని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆయన ప్రజలకు ఎంతగానో సేవలు అందించారని కొనియాడారు.
ఏపీలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడు ఈసారి బాగా జరిగిందని చెప్పారు. వచ్చే నెల నాటికి అన్ని కమిటీలు, రాష్ట్ర కమిటీలను నియామకం పూర్తి చేస్తామని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ పరిణామాలు, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును ఖతార్, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఐటోపియాలోని ప్రతినిధులకు వివరించామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. వారి నుంచి అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. తాము కలిసిన ప్రతి దగ్గర భారతదేశం ఎందుకు ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందనే విషయం గురించి తాము వివరించామని అన్నారు.
డిసీసీబీల్లో అక్రమాలకు చెక్ పెట్టేలా సంఘాలను కంప్యూటరీకరణ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జూన్కు సంబంధించిన ఆన్లైన్ లావాదేవీలపై విచారణ చేయాలని ఆదేశించామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
వైసీపీ అధినేత జగన్.. తన బాబాయ్ హత్యకి గొడ్డలి పోటు పొడిచారని.. ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందని ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖపట్నం జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జి విమర్శించారు. సొంత చెల్లికి, తల్లికి వెన్నుపోటు పొడిచింది జగనే అని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఏపీ సర్వనాశనం అయిందని గండి బాబ్జి విమర్శించారు.
ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చిన జూన్ 4వ తేదీని వైసీపీ నేతలు పశ్చాతాప దినంగా జరుపుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ హితవు పలికారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు జరుగుతున్న మేలును చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని.. అందుకే అలవాటు ప్రకారం అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఢిల్లీలో పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు గురువారం నాడు ఢిల్లీ వెళ్లారు. కడప నుంచి నేరుగా ఢిల్లీకి గురువారం సాయంత్రం బయలుదేరారు. శుక్రవారం రాత్రి కూడా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. ఢిల్లీ నుంచి శనివారం రాజమండ్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు.
నకిలీ మద్యంతో వేలకోట్లు లూటీ చేశారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. గతంలో ప్రశ్నిస్తే కేసులు.. పోరాడితే అరెస్టులు ఉండేవని లోకేష్ మండిపడ్డారు.
California NRIs Mahanadu: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రవాసాంధ్రుల సారథ్యంలో మినీ మహానాడు వేడుకలు సందడిగా సాగాయి. బే ఏరియాలో వెండితెర ఇలవేల్పు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.