Home » Telangana
కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జూన్ 2న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బుధవారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావులకు జిల్లా కలెక్టర్ కె హరిత, ఎస్పీ నితికా పంత్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఐటీడీఏ పీవో మంద మకరందు, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క, జిల్లా గ్రంధాలయసంస్థ చైర్మన్ అనిల్కుమార్, నియోజకవర్గ ఇన్చార్జీ శ్యాంనాయక్, డీపీఆర్వో సంపత్కుమార్లు ఘనస్వాగతం పలికారు. కాగా జిల్లాలో జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావులు అన్నారు.
సందర్భం ఏదైనా.. శబ్దాలమోత ఇప్పుడు ష్యాషన్గా మారింది. అందులో ప్రధానంగా డీజే బాక్స్లు సవ్వసాధారణమవుతున్నా యి. రాజకీయ, సామాజిక వర్గాల ప్రదర్శనలు దగ్గరి నుంచి మొదలుకుని వివాహ శుభకార్యాల బరాత్ (ఊరేగింపు), దైవ విగ్రహాల ప్రదర్శన వరకు ఎక్కడ చూసినా డీజే శబ్దాలు మోత మోగిపోతు న్నాయి. ఇప్పుడు వివాహ శుభకార్యాల సమయం కావడంతో పట్టణ ప్రాంతాలే కాకుండా పల్లెల్లోను డిజే సంప్రదాయంగా మారింది.
భానుడి భగభగతో జనం అల్లాడుతున్నారు. ఉదయం తొమ్మిది దాటకముందే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడిమికి జిల్లా కేంద్రంలోని రోడ్లన్ని మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారుతున్నాయి.వ్యవసాయ, ఉపాధి హామి కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో గత వారం రోజుల నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయి.
రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాటు చేయనున్న సభాస్థలి, రెబ్బెన మండలం ఎక్స్రోడ్, కాగజ్నగర్ మండలం డాడానగర్, కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీ మిల్లు క్రీడా ప్రాంగణాన్ని బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంఎల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ కె.హరిత, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్ రావులతో కలిసి పరిశీలించారు.
సజీవం గా ఉంటేనే చేయూత పింఛన్ పొందే వీలు ఉంటుం ది. చేయూత పింఛన్ లబ్ధిదారుల్లో మృతిచెం దిన వారి పేర్ల తొలగింపునకు కార్యాచరణ మొదలైంది. సజీవ నిర్ధారణ సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియకు ప్రభుత్వ స్వీకారం చుట్టింది. ఇది జూన్ 15 వరకు సర్వే చేపట్టనున్నారు. చేయూత పథకం కింద మృతి చెందిన వారి పేరిట బ్యాంకు ఖాతాలో జమ అయ్యే పింఛన్ డబ్బులను చాలాచోట్ల కుటుంబ సభ్యులు తీసుకుంటున్న దాఖాలాలున్నాయి. అలాంటి వాటిని తొలగించే ఉద్దేశంతో ప్రభుత్వం లబ్ధిదారులకు సంబంధించి సజీవ నిర్ధారణ సర్వే చేపడుతోంది
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
అత్తాపూర్లో యువతి కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసింది. ఎట్టకేలకు యువతిని పోలీసులు ట్రేస్ చేశారు. మలక్పేట్లోని తన ఇంట్లోనే యువతి సేఫ్గా ఉన్నట్లు తెలిపారు.
పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్సీహెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్మెంట్, పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్లో వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.
ప్రవాసాంధ్రుల సంక్షేమం, సమస్యల పరిష్కరానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఏపీ ఎన్ఆర్టీ భవన్లో మంత్రి కొండపల్లితో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సలహా కమిటీ సమావేశమైంది.