Home » Telangana
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ సీఎం, మంత్రులు ఇవాళ (గురువారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఖర్గే చర్చించారు. రెండేళ్ల ప్రభుత్వ పనితీరుపై రెండు గంటల పాటు ఖర్గే సమీక్ష జరిపారు..
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంపై తెలంగాణ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. జీవో నంబర్ 55ను సవాల్ చేస్తూ కోర్టులో గురువారెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు..
మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అభినందించారు. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యం గురించి మంత్రిని అడిగి తెలుసుకున్నారు..
బాల్క సుమన్ అరెస్ట్ దుర్మార్గపు చర్య అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలే పథకం ప్రకారం దాడి చేసి అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు..
కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ముహూర్తం ఖరారు చేశారు. పార్టీ పేరులో తెలంగాణ అనే పదం ఉంటుందని కవిత తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారైంది. ఈనెల 26 నుంచి సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
హైదరాబాద్లోని చర్లపల్లిలో తల్లీబిడ్డల ఆత్మహత్య కేసులో జీఆర్పీ పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. ముగ్గురి ఆత్మహత్యలో మరొకరి ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించారు.
ఎండలు క్రమంగా పెరుగుతుండడంతో విద్యుత్ డిమాండ్ సైతం పైపైకి వెళ్తోంది. సాధారణంగా వచ్చే బిల్లుల కంటే వేసవిలో అదనంగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో రీడింగ్ రాని విద్యుత్ మీటర్లపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) దృష్టి పెట్టింది.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు.
తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో హరిత ఇంధనమే కీలకమని తెలిపారు. రాష్ట్రంలో హరిత ఇంధనానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు.....