Home » Telangana
గోదావరిఖని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య మంగళవారం సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన వంటశాల, తాగునీటి సౌకర్యం మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు.
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు భధ్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడిన్ని నిరసిస్తూ మంగళవారం కాగజ్నగర్ బస్టాండు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపై కక్ష్య సాధింపుకు పాల్పడుతుందన్నారు.
కాగజ్నగర్ తాగునీటి సరఫరాకు రూ.31.70 కోట్లు మంజూరైనట్టు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. కాగజ్నగర్ మున్సిపాలిటీలొ మంగళవారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.
గంజాయి నిరోధానికి పోలీస్శాఖ ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ నితికా పంత్ అన్నారు. స్థానికంగా మంగళవారం ఎస్పీ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లో నమోదు అయిన 57 కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 296.31 కిలోల డ్రై గంజాయి, 964 గంజాయి మొక్కలను జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్డీపీఎస్ చట్టంలోని నిబంధనలను అనుసరించి పర్యావరణ కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటిస్తూ ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా దహనం చేసినట్లు ఎస్పీ తెలిపారు
ఓటరు జాబితా సవరణలో వివరాలు పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ కె.హరిత తెలిపారు. సిర్పూరు(టి)లో మంగళవారం కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటరు నమోదు చేసే ఎన్యూమరేషన్ ఫారాలను సక్రమంగా చూసుకొని తీసుకోవాలన్నారు. ఓటర్లు ఎలాంటి సందేహాలుంటే నివృత్తి చేయాలన్నారు. బీఎల్ఓలు చేసిన అంశాలపై తహసీల్దార్ రహీమోద్దీన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నిరుపేదలకు పనులు కల్పించ డమే లక్ష్యంగా గత యూపీఏ ప్రభుత్వం రూపకల్పన చేసిన మహత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి మీమీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) జూలై 1 నుంచి కొత్తరూపు దిద్దుకోబోతుంది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజివిక మిషన్ గ్రామీణ్(వీబీజీరామ్జీ) పథకం పేరుతో అమలు కాబోతుంది. దే
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయం తామే అని ఎంపీ డీకే అరుణ అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇకపై బీజేపీ హవా మొదలవుతుందని తెలిపారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తెలంగాణను గత ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనక్కి నెట్టిందని విమర్శించారు.
తెలంగాణలో రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా సభలో రూ.2,482 కోట్లను 41.37 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఊరట లభించింది. ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనపై నమోదైన కేసును కొట్టివేసింది.