Home » Telangana Police
హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. జల్పల్లి బాలాజీనగర్లో ఉన్న ఒక ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఆలయ పరిధిలోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు.
రంగారెడ్డి జిల్లాలోని బడంగ్పేట్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించడంతో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పూరులో వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో ఆర్టీవో వెంకన్నపై లారీ దూసుకెళ్లడంతో మృతిచెందారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని కాకతీయనగర్లో అడవి జంతువుల మాంసం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే అధికారుల రాకను గమనించిన కొందరు స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు.
హైదరాబాద్ శివారులోని ఆదిబట్ల పరిధిలో జరిగిన నీట్ పరీక్షలో మాల్ప్రాక్టీస్కు పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షా కేంద్రంలో ముందుగానే పథకం ప్రకారం మొబైల్ ఫోన్ను దాచిపెట్టి, పరీక్ష జరుగుతున్న సమయంలో గూగుల్ ద్వారా సమాధానాలు వెతుకుతూ పట్టుబడిన ఘటన కలకలం రేపింది.
ఖమ్మం నగరంలోని గాంధీనగర్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పచ్చని సంసారంలో వచ్చిన కుటుంబ కలహాలు ఇద్దరు అమాయక చిన్నారుల ప్రాణాలను బలితీసుకున్నాయి.
హయత్నగర్ పరిధిలోని పుల్లారెడ్డి స్వీట్స్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి తన భర్తతో కలిసి ఉత్తరాఖండ్లోని ముస్సోరీకి ట్రిప్నకి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, రాధాగాయత్రి మృతిపై.. తన స్నేహితులు సంచలన విషయాలు వెల్లడించారు.
హైదరాబాద్లోని మూసాపేట్ గూడ్స్ షెడ్ ప్రాంతంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్ వాహనాలు నిల్వ చేసే గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.