Home » Telangana Police
జగిత్యాల జిల్లా పరిధిలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబును పోలీసులు పట్టుకున్నారు. అదనపు కట్నం కోసం ఆమెను హత్య చేసిన్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఆగంతకుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఈ నెల 27వ తేదీలోగా ఆయనను చంపేస్తామని ఆగంతకులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ సమీపంలో దారుణ ఘటన జరిగింది. అక్క ప్రవర్తన సరిగా లేదనే కారణంతో తమ్ముడు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అమానుషంగా ఆమెను హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ప్రాంతంలో జరిగిన ఫామ్హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన పోలీసుల రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు బయటపడ్డాయి.
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. లగ్జరీ పార్టీ, డ్రగ్స్ వినియోగం, విదేశీ మద్యం, అలాగే కాల్పుల ఆరోపణలు వంటి అంశాలు ఈ కేసును మరింత సంచలనంగా మార్చాయి.
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోందని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ పార్టీ సమాచారం తెలుసుకునే అక్కడికి వెళ్లామని చెప్పారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తొక్కాపురం గ్రామంలో అత్యంత విషాదకర ఘటన జరిగింది. మతిస్థిమితం లేని ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలపై కత్తితో దాడి చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం ప్రాంతంలో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిన యువతిపై ఒక యువకుడు ఎయిడ్స్ సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించినట్లు ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ విమానాలు రద్దు అయ్యాయి. మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల కారణంగా విమానాలు రద్దు అయ్యాయని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలోని పఠాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల హత్య జరిగింది. ఈ ఘటన ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటిజన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో చోటుచేసుకుంది. వాచ్మన్గా ఉన్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.