Home » Telangana Police
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు కుమారుడు వెంకట్పై కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. బంజారాహిల్స్ ప్రాంతంలోని ఓ ఇంటి విషయంలో బెదిరింపులకు దిగారని బాధితుడు వెంకట్ తన ఫిర్యాదులో తెలిపారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి నందగిరి హిల్స్లోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
యువ నటుడు చంద్రహాస్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది.
చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది గోటికె స్వప్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ హత్యకు సొంత అన్నే సూత్రధారి అని తేలడం స్థానికంగా కలకలం రేపింది.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేస్తోందని స్పష్టం చేశారు. భార్యాభర్తల సంభాషణలు వినే దుశ్చర్యకు పాల్పడితే విచారణ జరపాలా, వద్దా అని ప్రశ్నించారు.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను.. సిట్ సుమారు నాలుగున్నర గంటలకు పైగా విచారించింది. ఈ విచారణలో సిట్ అధికారులు పలు కీలక అంశాలపై కేసీఆర్ను నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం.
ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో సెకను కాలం కూడా పక్కకు తప్పుకోని ధీశాలి కేసీఆర్ అని ప్రశంసించారు..
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేపు విచారణకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసానికి పోలీసులు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక దర్యాప్తు బృందం మధ్య జరుగుతున్న నోటీసుల పర్వం ఇప్పుడు హైకోర్టు మెట్లెక్కే అవకాశం కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా సిట్ వేగవంతమైన చర్యలు చేపట్టింది.