Home » Telangana Assembly
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ కవి అందెశ్రీ కుటుంబానికి అండగా నిలవాలని భావించింది. ఇందులో భాగంగా అందెశ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి వీలుగా 1994 ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, వేతన నిర్మాణ చట్ట సవరణ బిల్లును తెలంగాణ శాసన సభలో ఇవాళ ప్రవేశపెట్టింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. నీటి ప్రాజెక్టులపై బీజేపీ ఎమ్మెల్యేలు సభలో తమ గళం వినిపించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం రాజకీయ ధూషణలకే పరిమితమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని విమర్శలు చేశారు. తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
పేదల హక్కులు దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయం ఉందని సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉందని చెప్పుకొచ్చారు. కొత్త చట్టంతో పని దినాలు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మోటారు వాహనాల పన్ను విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. రవాణా శాఖలో తెలంగాణ మోటారు వాహనాల పన్ను సవరణ చట్టంపై శాసన సభలో చర్చ జరిగింది.
అత్యధిక పన్ను కడుతున్న హిందువుల సొమ్మును ముస్లింలకు దోచి పెడుతున్నారని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ఆరోపణలు చేశారు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్ లేదని.. తోక లేదని ఎద్దేవా చేశారు. దోచుకోవడానికి అప్పుడు కాళేశ్వరం.. ఇప్పుడు మూసీని తెరమీదకు తెచ్చారని దెప్పిపొడిచారు.
అసెంబ్లీని గాంధీ భవన్లాగా, సీఎల్పీ మీటింగ్లాగా మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా లేక స్ట్రీట్ రౌడీనా అని విమర్శలు గుప్పించారు.
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభ మొదలైన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ అధికార నాయకత్వంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గులాబీ పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నాయకులను డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్, ఉప నేతలు, విప్లుగా ప్రకటించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిసారి బీఆర్ఎస్ నాయకులను విమర్శించడమే సరిపోతోందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. నీటి వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర పోతుందా.. నిద్ర పోతున్నట్లు నటిస్తుందా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.