• Home » Telangana Assembly

Telangana Assembly

Telangana Assembly: బీఆర్‌ఎస్‌ వల్లే ఆగిన బిల్లులు!

Telangana Assembly: బీఆర్‌ఎస్‌ వల్లే ఆగిన బిల్లులు!

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్‌ బిల్లులు గవర్నర్‌ ఆమోదం పొందకుండా వాటిని రాష్ట్రపతికి పంపడం వెనక బీఆర్‌ఎస్‌ పాత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Mallu Bhatti Vikramarka VS BRS: కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కాళేశ్వరం అంచనాలు పెంచారు.. మల్లు భట్టి విక్రమార్క ఫైర్

Mallu Bhatti Vikramarka VS BRS: కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కాళేశ్వరం అంచనాలు పెంచారు.. మల్లు భట్టి విక్రమార్క ఫైర్

కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను లక్ష కోట్లకు పెంచారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. పీసీ ఘోష్‌ కమిషన్ నివేదిక అసెంబ్లీలో పెట్టొద్దని, చర్చ చేయొద్దని హైకోర్టుకు వెళ్లి చేయాల్సింది అంతా మీరే చేశారని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

BRS MLAs Protest in  Assembly: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన.. ఎందుకంటే..

BRS MLAs Protest in Assembly: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన.. ఎందుకంటే..

కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఆదివారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా మాజీ మంత్రి హరీష్‌రావుకు మైక్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

Minister Komatireddy Venkata Reddy  VS BRS:  శిక్షలు తప్పించుకోడానికి హరీష్ రావు డ్రామాలు.. మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

Minister Komatireddy Venkata Reddy VS BRS: శిక్షలు తప్పించుకోడానికి హరీష్ రావు డ్రామాలు.. మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ కూలడానికి తామే కారణమని సభకు వచ్చి కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హితవు పలికారు. బీసీ రిజర్వేషన్లపై, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుంటే కేసీఆర్ సభకు ఎందుకు రారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

Harish Rao VS Congress: కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోంది.. మంత్రి ఉత్తమ్‌‌పై హరీష్‌రావు ఫైర్

Harish Rao VS Congress: కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోంది.. మంత్రి ఉత్తమ్‌‌పై హరీష్‌రావు ఫైర్

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆదివారం హడావుడిగా చర్చ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఏంటో అర్థమైందని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. కేసీఆర్‌కు, తనకు కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ 8బీ కింద నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. 8బీ కింద నోటీసులు ఇవ్వకపోతే రిపోర్టు చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందని మాజీ మంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు.

Minister Uttam Discussed ON Kaleshwaram Report:  లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నాలుగేళ్లలోనే కూలింది

Minister Uttam Discussed ON Kaleshwaram Report: లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నాలుగేళ్లలోనే కూలింది

కేబినెట్‌ అనుమతి లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం పూర్తి చేయడానికి రూ.లక్షా 27 వేలకోట్లు అవసరమని పేర్కొన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదని వెల్లడించారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ నాలుగేళ్లలోనే కూలిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Discussion on  Kaleshwaram Commission Report: కాలేశ్వరంపై అసెంబ్లీలో మెుదలైన చర్చ.. లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Discussion on Kaleshwaram Commission Report: కాలేశ్వరంపై అసెంబ్లీలో మెుదలైన చర్చ.. లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ మెుదలైంది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటు, లోపాటులపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై లఘుచర్చ జరుగుతోంది.

BIG BREAKING: తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం..

BIG BREAKING: తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం..

తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సుదీర్ఘ చర్చల అనంతరం.. బీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పలికింది. అన్ని పార్టీలు బీసీ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు త్వరలో కార్యరూపం దాల్చనుంది.

KTR On Assembly: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రోజుకో మాట మాట్లాడుతోంది..

KTR On Assembly: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రోజుకో మాట మాట్లాడుతోంది..

బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని కేటీఆర్ తెలిపారు. చట్టసభల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశామన్నారు. బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలని ఆయన సూచించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రోజుకో మాట మాట్లాడుతోందని విమర్శించారు.

TG Assembly: నేడు అసెంబ్లీలో కాళేశ్వరం చర్చ.. వ్యూహాలు రచిస్తున్న నేతలు

TG Assembly: నేడు అసెంబ్లీలో కాళేశ్వరం చర్చ.. వ్యూహాలు రచిస్తున్న నేతలు

అసెంబ్లీలో కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ యాక్ట్ 285Aను సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి