Home » Team India
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. విరాట్ ఫామ్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ దేశవాళీల్లో ఆడాల్సిన అవసరం లేదని వెల్లడించాడు.
నేటి నుంచి న్యూజిలాండ్-భారత జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొద్ది రోజులుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. సూర్యకు ఓ కీలక సూచన చేశాడు.
భారత్లో టీ20 ప్రపంచ కప్ ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లా కెప్టెన్ లిట్టన్ దాస్ ఈ విషయంపై స్పందించాడు. ప్రపంచ కప్ ఆడటంపై తాము మాట్లాడటం సురక్షితం కాదని వెల్లడించాడు.
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 1-2 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. స్వదేశంలో సిరీస్లను కోల్పోతుండటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఓటములపై సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే స్పందించాడు.
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి సర్ నుంచి నోటీసులు అందిన విషయం తెలిసిందే. దీంతో షమీ మంగళవారం కోల్కతాలోని బిక్రంగఢ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఎన్నికల సంఘం అధికారుల ముందు ఆయన విచారణకు హాజరయ్యారు.
టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా అతడు పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర వివాదాస్పదమైంది. రింకూ సరదాగా చేసిన ఈ పని.. హిందువుల మనోభావాలను దెబ్బతీసింది.
భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై పెద్దఎత్తున వ్యతిరేకత మొదలైంది. సొంతగడ్డపై చెలరేగాల్సిన భారత జట్టు.. గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుస ఓటములను చవిచూస్తోందంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 41 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే స్టార్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా అర్ధ శతకంతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్.. హర్షిత్ రాణా బ్యాటింగ్పై మాట్లాడాడు.
ఇండోర్ వేదికగా భారత్తో జరిగిన ఆఖరి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 338 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన భారత్.. 41 పరుగుల తేడాతో ఓడింది. ఈ మూడు వన్డేల సిరీస్ను కివీస్.. 2-1 తేడాతో దక్కించుకుంది..
భారత జట్టులో స్టార్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా గొప్పగా రాణిస్తున్న విషయం తెలిసిందే. హెడ్ కోచ్ గంభీర్ వల్ల హర్షిత్కి తుది జట్టులో చోటు దక్కుతుందంటూ అభిమానుల నుంచి క్రికెట్ మాజీల వరకు చర్చించుకున్న సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన దశలను హర్షిత్ రాణా గుర్తు చేసుకున్నాడు..