Home » Tamilnadu News
టీవీకే పార్టీ అధినేత విజయ్కి కష్టాలు తప్పటం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ లేకపోవటం వల్ల.. 108 సీట్లు సాధించినా సీఎం పీఠంపై కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే విజయ్ మూడు సార్లు గవర్నర్ను కలిశారు. మూడోసారి కూడా విజయ్కి నిరాశే ఎదురైంది.
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం కొలువుదీరడానికి అడుగులు పడుతున్నా, మద్దతివ్వడానికి వామపక్షాలు, వీసీకే, కాంగ్రెస్ పెడుతున్న షరతులు విజయ్ తలని బొప్పికట్టించేలా ఉన్నాయి. అటు కాంగ్రెస్, ఇటు వామపక్షాలు, వీసీకే తమ మద్దతుకు సంబంధించి కీలక ప్రకటనలు చేశాయి.
తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై తలెత్తిన ఉత్కంఠకు తెరపడనుంది. కాంగ్రెస్తో పాటు వీసీకే, సీపీఎం, సీపీఎం పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించాయని, మద్దతు లేఖలు తీసుకుని గవర్నర్ను కలుస్తారని టీవీకే పార్టీ వర్గాలు వెల్లడించాయి.
విజయ్కు చెందిన TVK పార్టీకి మద్దతు ఇవ్వాలా.. వద్దా అనే అంశంపై చర్చించడానికి విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) తన ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశం అనంతరం ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనే దానిపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయమై సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు చర్చిస్తున్నాయని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీపీఐ నేత బినోయ్ విశ్వం చెబుతుంటే, అసెంబ్లీ వేదికగా టీవీకేకు బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా డిమాండ్ చేస్తున్నారు.
డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల అగ్రనేతలు దశాబ్దాల వైరాన్ని మరిచి పొత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు.
అనిశ్చితికి తెరదించుతూ తమిళనాడులో AIADMK త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆ పార్టీ సీనియర్ నేత అన్బళగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఊహించని విధంగా తమిళనాడులో ఒక 'అద్భుతం' జరగబోతోందని ఆయన ఆన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా కలకలం రేపుతున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆ పార్టీ అధినేత విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భగా ఆ రాష్ట్ర గవర్నర్ అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ స్పందించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన TVK అధినేత విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ ఆలస్యం చేస్తుండటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పడుతోంది. రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీవీకే పార్టీకి పట్టం కట్టారని, అయినాకాని, విజయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు. విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, అదే న్యాయమని చెప్పారు.