Home » Supreme Court
వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన కంపెనీకి సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుపై దాఖలు చేసిన పిటిషన్ను, ఏపీ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించింది.
దాదాపు పదమూడేళ్లుగా కోమాలో ఉంటూ జీవచ్ఛవంలా మారిన హరీశ్ రాణా కన్నుమూశాడు. కారుణ్య మరణానికి అనుమతి పొందిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందిన హరీశ్.. ఢిల్లీలోని ఎయిమ్స్లో మంగళవారం మృతిచెందాడు.
పీజీ వైద్య సీట్ల భర్తీపై కీలక నిర్ణయం వెలువడింది. తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్కు ఇకపై పొడిగింపు ఇవ్వలేమని న్యాయ స్థానం స్పష్టం చేసింది. జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇప్పటికే 7 రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో మరింత పొడిగింపు అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.
మతం మారిన వారి ఎస్సీ హోదాకు సంబంధించి సుప్రీం కోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ (SC) హోదా వర్తించదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్ సీట్ల భర్తీ కౌన్సెలింగ్ పొడిగింపుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ పొడిగింపునకు సంబంధించి అనుమతి ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలని మెడికల్ కమిషన్కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ పీజీ సీట్ల భర్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టును వైద్య విద్య కళాశాల యాజమాన్యాలు ఆశ్రయించాయి. ఫిబ్రవరి 28వ తేదీతో కౌన్సెలింగ్ ముగిసిందని తెలిపాయి.
భార్యను పనిమనిషిలా చూడకూడదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో జరిగిన వైవాహిక వివాదాల కేసు విచారణలో, ఇంటి పనుల్లో భర్తలు కూడా సమానంగా బాధ్యతలు పంచుకోవాలని స్పష్టం చేసింది.
మద్యం కుంభకోణం కేసులో ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అవినాశ్ ఏ-7గా ఉన్నారు.
కోల్కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయంపై ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిపిన సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇది హర్షించదగిన పరిణామం కాదని పేర్కొంది.