Home » Supreme Court
నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. తెలంగాణ దాఖలు చేసిన ఈ పిటిషన్పై సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో పర్యటించనున్నారు. ముంబైలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. ముంబై పర్యటనలో భాగంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీతో సమావేశం కానున్నారు.
ఆరావళి పర్వత శ్రేణిపై ఒక కమిటీ సిఫార్సులను ఆమోదించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న తరువాత, ఆరావళికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ సుమోటో కేసు ప్రారంభమైంది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ అత్యాచార కేసుపై సుప్రీం కోర్టులో తాజాగా విచారణలు జరిగాయి. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది న్యాయస్థానం.
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. వనస్థలిపురం దగ్గర ఉన్న 102 ఎకరాల భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో దీర్ఘ కాలంగా కొనసాగుతున్న భూ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టైంది..
ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో తీవ్రస్థాయికి చేరుకుంటున్న వాయు కాలుష్య సమస్యపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. సరిహద్దుల్లోని టోల్ ప్లాజాలు ట్రాఫిక్ ఆటంకాలు, క్యూలకు దారితీసి కాలుష్యాన్ని పెంచుతున్నాయని గుర్తించింది.
కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఐదు ఎన్నికల హామీలను ఇచ్చిందని, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలకు ఇవి విరుద్ధమని పిటిషనర్ గతంలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
ఇసుక కుంభకోణం కేసుకు సంబంధించి సుప్రీంలో జేపీ వెంచర్స్ ఐఏ దాఖలు చేసింది. ఎన్జీటీ విధించిన జరిమానాను తాము చెల్లించాల్సిన అవసరం లేదంటూ సుప్రీంలో జేపీ వెంచర్స్ వాదనలు వినిపించింది.
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఇండిగో సంక్షోభంపై విచారణ జరపటానికి భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు నో చెప్పింది. కేంద్రం తీసుకున్న చర్యలపై ప్రశంసలు కురిపించింది.
ఇండిగో సంక్షోభం కేసు సుప్రీం కోర్టుకు చేరింది. ఇండిగో సంస్థ ఎఫ్డీటీఎల్ నియమాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై సీజేఐ నివాసంలో విచారణ జరగనున్నట్టు తెలుస్తోంది.