Home » Supreme Court
కంచ గచ్చిబౌలి భూ వ్యవహారంలో అటవీ పునరుద్ధరణకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. అయితే, మంచి ప్రణాళికతో వస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడమే కాక సుమోటోగా తీసుకున్న చర్యలను కూడా ఉపసంహరించుకుంటామని సీజేఐ జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్లకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. శాసనమండలి సభ్యులుగా వారి నియామకాన్ని రద్దు చేసింది. వారిద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడమే తప్పు అని పేర్కొంది.
ఢిల్లీ ఎన్సీఆర్లోని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పునఃసమీక్షించనుంది..
న్యాయమూర్తులు జేబీ పరిడివాలా, ఆర్.మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న ఇచ్చిన తీర్పులో ఢిల్లీ-ఎన్సీఆర్ అధికారులు వీధి కుక్కలన్నింటినీ శాశ్వత షెల్టర్లకు సాధ్యమైనంత త్వరగా తరలించాలని ఆదేశించింది.
ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్ విచారణ కొనసాగించారు. గతంలో బీహార్లో నిర్వహించిన సమ్మరీ రివిజన్లో ఏడు ధ్రువపత్రాలను మాత్రమే అనుమతించారని పేర్కొన్నారు.
న్యాయమూర్తులు జేబీ పరిడివాలా, ఆర్.మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న ఇచ్చిన తీర్పులో ఢిల్లీ-ఎన్సీఆర్ అధికారులు వీధి కుక్కలన్నింటినీ శాశ్వత షెల్టర్లకు సాధ్యమైనంత త్వరగా తరలించాలని ఆదేశించింది. వీధి కుక్కలు కరవడం వల్ల రాబిస్ వ్యాధి కేసులు పెరగడం, ముఖ్యంగా పిల్లలు వీటి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇవాళ(బుధవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్దరణ చర్యలు చేపడుతున్నామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సమగ్ర ప్రణాళికను సమర్పించేందుకు ప్రభుత్వం ఆరు వారాలు గడువు కోరింది.
నివాసంలో భారీగా నగదు బయటపడిన వ్యవహారంలో న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించిన ప్రక్రియను లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించారు. ...
బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ వివాదంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ...
ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టే అధికారం ఈసీఐకి ఉందా అనే ప్రాథమిక అంశాన్ని నిర్ణయించాల్సి ఉంటుందని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. అలాంటి అధికారం లేనట్టయితే ఈ అంశం ఇక్కడితో ముగుస్తుందని, ఆ అధికారం ఈసీఐకి ఉన్నట్లయితే ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియపై ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదని అన్నారు.