Home » Stock Market
ఈ వారం వరుసగా మూడో రోజు కూడా దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం 1,067 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మడం మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది.
ఆకర్షణీయమైన స్టాక్స్లో ఒకటైన ఇండస్ ట్రేడ్ లింక్స్ లిమిటెడ్ ఇటీవల పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచే రాబడులను అందించింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీగా కొనుగోళ్లు పెరగడంతో, ఈ షేరు గత ఐదేళ్లలో ఏకంగా 1400 శాతం వరకు మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది.
సోమవారం స్వల్ప లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం 1,883 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మడం మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది.
సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ కోలుకున్నాయి. కంపెనీలు వెలువరిస్తున్న త్రైమాసిక ఫలితాలు కూడా మదుపర్లలో విశ్వాసం నింపాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా సూచీలను నష్టాల నుంచి లాభాల వైపు నడిపించాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించనుందనే అంచనాలు వెలువడిన నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం లాభాలను ఆర్జించాయి. అంచనాలకు అనుగుణంగానే 25 శాతం వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గించినప్పటికీ, ఈ ఏడాదిలో మరోసారి రేట్ల కోత ఉండదని ఛైర్మనె తేల్చి చెప్పడంతో మదుపర్లు కలవరానికి గురయ్యారు.
సోమవారం నష్టాలను చవిచూసిన సూచీలు మంగళవారం కోలుకున్నాయి. భారత్తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం పాజిటివ్ సెంటిమెంట్ను పెంచింది.
ఉదయం భారీ నష్టాలను చవి చూసిన దేశీయ సూచీలు చివర్లో కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టం నుంచి దాదాపు 400 పాయింట్లు పుంజుకున్నాయి. చివరకు ఓ మోస్తరు నష్టాలతో రోజును ముగించాయి.
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరే సూచనలు మదుపర్లలో విశ్వాసాన్ని పెంచాయి. విదేశీ మదుపర్ల ఆసక్తి, మెటల్, గ్యాస్, ఆయిల్ రంగాల్లో కొనుగోళ్లు దేశీయ సూచీల్లో జోష్ నింపాయి. దీంతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి.
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు దేశీయ సూచీల్లో జోష్ నింపాయి. భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరే సూచనలు, భారత్ ఎగుమతులపై అమెరికాలో సుంకాలు 50 నుంచి 15 శాతానికి దిగి వస్తాయనే అంచనాలు మదుపర్లలో విశ్వాసాన్ని పెంచాయి.
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయంగా పండగ వాతావరణం, త్రైమాసిక ఫలితాలపై ఆశాజనకంగా ఉండడం దేశీయ సూచీల్లో జోష్ నింపాయి. సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి.