Home » Srisailam
ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
శ్రీశైలం లాంటి దివ్య క్షేత్రాన్ని మరింత తీర్చిదిద్దాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీశైలంలో ఒకే ప్రాంగణంలో స్వామివారి జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తిపీఠం ఉండటం దేశంలోనే ఎక్కడా లేని విశేషమని అభివర్ణించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటనలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. పోలీసు అధికారులు ప్రణాళిక ప్రకారం సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా పర్యటనపై ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో కూటమి నాయకులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 16వ తేదీన కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు. ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు.
శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో సోమవారం నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 2వ తేదీ వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నారు.
రాజస్థాన్కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫిరంగిపురం మండలం పొనుగుపాడు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
చంద్రగ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారం పలు ఆలయాలను మూసివేయనున్నారు. తిరిగి సోమవారం దేవస్థానాల సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని ఆలయాల అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయాల అధికారులు పేర్కొన్నారు.