Home » Special trains
దసరా, దీపావళి సందర్భంగా కొన్ని మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్లను అక్టోబరు నుంచి నవంబరు వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే (SCR) అత్యధికంగా 48 రైళ్లను నడుపనుంది. 684 ట్రిప్పులు పూర్తి చేస్తుంది. ఈ నిర్ణయంతో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ నుంచి ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.
దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని సెప్టెంబరు 9 నుంచి నవంబరు 19 వరకూ బిలాస్ పూర్-యల్హంక (వయా గుంతకల్లు) మధ్య ఓ ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రయాణికుల రద్దీ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి-తిరుపతి (07011) ప్రత్యేక వీక్లీ రైలు సెప్టెంబరు 5 నుంచి 26 వరకూ శుక్రవారాలలో, దీని తిరుగు ప్రయాణపు రైలు (07012) సెప్టెంబరు 6 నుంచి 27 వరకూ శనివారాలలో నడపనున్నట్లు తెలియజేశారు.
దీపావళి పండుగ రద్దీని నివారించే నిమిత్తం నడిపే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ముందస్తు రిజర్వేషన్ టిక్కెట్లు బుకింగ్స్ సోమవారం ప్రారంభమైంది. ఆన్లైన్లో బుకింగ్ విండో ప్రారంభించగానే కేవలం ఐదు నిమిషాల్లోనే ఆ టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా ఫుల్ అయ్యాయి.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి-కాకినాడ నాందేడ్-తిరుపతి మధ్య వీక్లీ స్పెషల్ రైళ్లను పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి సికింద్రాబాదు- మైసూర్-సికింద్రాబాద్ (వయా గుంతకల్లు) ప్రత్యేక బైవీక్లీ ఎక్స్ప్రెస్ను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాదు-మైసూర్ బైవీక్లీ ప్రత్యేక రైలు (07033) ఈ నెల 8 నుంచి 29 వరకూ సోమ, శుక్రవారాలలో నడపనున్నారు.
ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-బీదర్ (06519) ప్రత్యేకరైలు ఈ నెల 14న బెంగళూరులో రాత్రి 9-15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం పదకొండున్నరకు బీదర్కు చేరుకుంటుందన్నారు.
తమిళనాడులోని నాగపట్టణంలో వెలసిన వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బాంద్రా టెర్మిన్స-వెలంకని ప్రత్యేక రైలు (09093) ఈ నెల 27, సెప్టెంబరు ఆరో తేదీల్లో రాత్రి 9-40 గంటలకు బాంద్రా టెర్మిన్సలో బయలుదేరి రెండో రోజు ఉదయం 7-40 గంటలకు వెలంకనికి చేరుకుంటుందన్నారు.
రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి - పాట్నా మధ్య నడిచే స్పెషల్ వీక్లీ రైళ్లను పొడిగించి (స్టేషన్ల సంఖ్య పెంపు) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. (03253) పాట్నా - చర్లపల్లి మధ్య నడిచే వీక్లీ స్పెషల్ రైలు సోమ, బుధవారాల్లో ఈ నెల 4 నుంచి 29 వరకు జహనాబాద్ వరకు పొడిగించి నడిపిస్తున్నట్లు చెప్పారు.