• Home » Special trains

Special trains

Special Trains: బిలాస్‏పూర్‌-యల్హంక మధ్య ప్రత్యేక రైలు

Special Trains: బిలాస్‏పూర్‌-యల్హంక మధ్య ప్రత్యేక రైలు

దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని సెప్టెంబరు 9 నుంచి నవంబరు 19 వరకూ బిలాస్ పూర్‌-యల్హంక (వయా గుంతకల్లు) మధ్య ఓ ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Special Trains: దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు..  ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

Special Trains: దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

ప్రయాణికుల రద్దీ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి-తిరుపతి (07011) ప్రత్యేక వీక్లీ రైలు సెప్టెంబరు 5 నుంచి 26 వరకూ శుక్రవారాలలో, దీని తిరుగు ప్రయాణపు రైలు (07012) సెప్టెంబరు 6 నుంచి 27 వరకూ శనివారాలలో నడపనున్నట్లు తెలియజేశారు.

Trains: ఐదు నిమిషాల్లో ఫుల్‌..

Trains: ఐదు నిమిషాల్లో ఫుల్‌..

దీపావళి పండుగ రద్దీని నివారించే నిమిత్తం నడిపే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ముందస్తు రిజర్వేషన్‌ టిక్కెట్లు బుకింగ్స్‌ సోమవారం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ విండో ప్రారంభించగానే కేవలం ఐదు నిమిషాల్లోనే ఆ టిక్కెట్లన్నీ హాట్‌ కేకుల్లా ఫుల్‌ అయ్యాయి.

Trains: చర్లపల్లి-కాకినాడ, నాందేడ్‌-తిరుపతి వీక్లీ స్పెషల్‌ రైళ్ల పొడిగింపు

Trains: చర్లపల్లి-కాకినాడ, నాందేడ్‌-తిరుపతి వీక్లీ స్పెషల్‌ రైళ్ల పొడిగింపు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి-కాకినాడ నాందేడ్‌-తిరుపతి మధ్య వీక్లీ స్పెషల్‌ రైళ్లను పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Special Train: 8 నుంచి సికింద్రాబాద్‌-మైసూర్‌ ప్రత్యేక రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే..

Special Train: 8 నుంచి సికింద్రాబాద్‌-మైసూర్‌ ప్రత్యేక రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే..

ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి సికింద్రాబాదు- మైసూర్‌-సికింద్రాబాద్‌ (వయా గుంతకల్లు) ప్రత్యేక బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‏ను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాదు-మైసూర్‌ బైవీక్లీ ప్రత్యేక రైలు (07033) ఈ నెల 8 నుంచి 29 వరకూ సోమ, శుక్రవారాలలో నడపనున్నారు.

Special Trains: గుంతకల్లు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

Special Trains: గుంతకల్లు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి గుంతకల్లు రైల్వే డివిజన్‌ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-బీదర్‌ (06519) ప్రత్యేకరైలు ఈ నెల 14న బెంగళూరులో రాత్రి 9-15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం పదకొండున్నరకు బీదర్‌కు చేరుకుంటుందన్నారు.

Special Train: గుంతకల్లు ఏరియా వాసులకు గుడ్‏న్యూస్.. వెలంకనికి ప్రత్యేక రైలు

Special Train: గుంతకల్లు ఏరియా వాసులకు గుడ్‏న్యూస్.. వెలంకనికి ప్రత్యేక రైలు

తమిళనాడులోని నాగపట్టణంలో వెలసిన వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బాంద్రా టెర్మిన్‌స-వెలంకని ప్రత్యేక రైలు (09093) ఈ నెల 27, సెప్టెంబరు ఆరో తేదీల్లో రాత్రి 9-40 గంటలకు బాంద్రా టెర్మిన్‌సలో బయలుదేరి రెండో రోజు ఉదయం 7-40 గంటలకు వెలంకనికి చేరుకుంటుందన్నారు.

Special Trains: చర్లపల్లి - పాట్నా వీక్లీ స్పెషల్‌ రైలు పొడిగింపు

Special Trains: చర్లపల్లి - పాట్నా వీక్లీ స్పెషల్‌ రైలు పొడిగింపు

రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి - పాట్నా మధ్య నడిచే స్పెషల్‌ వీక్లీ రైళ్లను పొడిగించి (స్టేషన్ల సంఖ్య పెంపు) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. (03253) పాట్నా - చర్లపల్లి మధ్య నడిచే వీక్లీ స్పెషల్‌ రైలు సోమ, బుధవారాల్లో ఈ నెల 4 నుంచి 29 వరకు జహనాబాద్‌ వరకు పొడిగించి నడిపిస్తున్నట్లు చెప్పారు.

Special trains: ఓనం సందర్భంగా ప్రత్యేక రైళ్లు

Special trains: ఓనం సందర్భంగా ప్రత్యేక రైళ్లు

ఓనం పండుగను పురస్కరించుకుని చెన్నై సెంట్రల్‌-కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.06119 చెన్నై సెంట్రల్‌-కొల్లం వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 27, సెప్టెంబరు 3,10 తేదీల్లో చెన్నై సెంట్రల్‌ నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.40 గంటలకు కొల్లం చేరుకుంటుంది.

Special trains: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్..  చర్లపల్లి నుంచి ప్రత్యేక వీక్లీ రైళ్లు

Special trains: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక వీక్లీ రైళ్లు

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 15 వరకు (ప్రతి శుక్రవారం) ఎర్నాకుళం- పాట్నా(06085) మార్గంలో నాలుగు రైళ్లు, ఈనెల 28నుంచి ఆగస్టు 18 వరకు(ప్రతి సోమవారం) పాట్నా-ఎర్నాకుళం (06086) మధ్యలో నాలుగు రైళ్లు నడుస్తాయని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి