Home » Siddaramaiah
కర్ణాటక వెనుకబడి తరగతుల కమిషన్ చేపట్టిన 'సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వే'లో పాల్గొన రాదని నారాయణ మూర్తి దంపతులు నిర్ణయం తీసుకున్నారు. ఎన్యూమరేషన్ కోసం ఆ దంపతుల ఇంటికి వెళ్లినప్పుడు తమకు సర్వే అక్కర్లేదని చెప్పినట్టు అధికారులు తెలిపారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాయకత్వ సమస్య పార్టీని ఇరకాటంలో పెడుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా సిద్ధరామయ్య-డీకే శివకుమార్ల మధ్య చెరో రెండున్నరేళ్లు పాలన చేపట్టేందుకు రహస్య ఒప్పందం కుదిరిందనే ఊహాగానాలు వెలువడ్డాయి.
విప్రో క్యాంపస్ మీదుగా ట్రాఫిక్ అనుమతించాలన్న అభ్యర్థనను సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ తిరస్కరించారు. క్యాంపస్లో అంతర్జాతీయ క్లైంట్స్కు సేవలందిస్తుంటామని తెలిపారు.
ఈ ఏడాది మైసూరు దసరా ఉత్సవాల ప్రారంభానికి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత బాను ముస్తాక్ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో వివాదం తలెత్తింది. ఆమె గతంలో హిందూ వ్యతిరేక, కన్నడ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని బీజేపీ అభ్యంతరం పెట్టింది
ప్రజల్ని మతం మారమని ఏ రాజకీయ పార్టీ కోరదని, అయినప్పటికీ మతమార్పిడులు జరుగుతున్నాయని, అది వారి హక్కు అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఇస్లాం, క్రైస్తవం, ఇతర ఏ మతాల్లోనైనా అసమానత్వం ఉండొచ్చన్నారు. కానీ..
కర్ణాటకలోని 7 కోట్ల ప్రజానీకం సామాజిక, విదాస్థితిని ఈ సర్వే తెలయజేయనుందని మీడియాతో మాట్లాడుతూ సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఇందుకోసం 1,75,000 మంది టీచర్లు పనిచేస్తారని, ఒక్కొక్కరికి రూ.20,000 వరకూ పారితోషిక అందుతుందని తెప్పారు.
ఆరు వేర్వేరు సందర్భాల్లో సిద్ధరామయ్య ప్రభుత్వ కారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు కథనాలు వచ్చాయి. తాజాగా బెంగళూరులో ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కెమెరాల్లో సీఎం ఫ్రంట్ సీటులో సీటుబెల్ట్ పెట్టుకోకుండా కూర్చున్నట్టు రికార్డయింది.
1991 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరగడం వల్లే తాను ఓడిపోయానని సిద్ధరామయ్య చెప్పారు. అప్పట్లో జనతా దళ్ సెక్యులర్ అభ్యర్థిగా ఆయన నార్త్ కర్ణాటకలోని కొప్పల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు తెరలేపాయి. అధికార పంపకాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
సిద్ధరామయ్య అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ సి.మోహన్ కుమార్, డీకే శివకుమార్ ప్రత్యేక అధికారి హెచ్.ఆంజనేయ మధ్య మాటల యుద్ధం దాడులకు దారితీసిందని తెలుస్తోంది.