Home » Savitha
పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబే... అని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. జిల్లాలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు హాయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతోందన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని మంత్రి అన్నారు.
కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీల పక్షపాతి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న భక్త కనకదాసు జయంతి వేడుకలు, విగ్రహావిష్కరణ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
జగన్ అధికారంలో ఉండగా అమరావతి రైతులను ముప్పుతిప్పలు పెట్టారని... ఇప్పుడు రైతుల పరామర్శ అంటారా అంటూ మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదరణ-3 పథకం అమలుపై బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. విజయవాడలో ఇవాళ(సోమవారం నాడు) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో ఆదరణ-3 పథకం అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. అలానే ఈ పథకానికి రూ. వెయ్యి కోట్లు వెచ్చించబోతున్నట్లు మంత్రి చెప్పారు.
మొంథా తుపానుతో అప్రమత్తంగా ఉండాలని ఏపీ మంత్రి సవిత ఆదేశాలు జారీచేశారు. తుపాను దృష్ట్యా చేపట్టే చర్యలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. వార్డెన్లు, ఏబీసీడబ్ల్యూవోలు 24 గంటలూ హాస్టళ్లలో ఉండాల్సిందేనని ఆజ్ఞాపించారు మంత్రి సవిత.
విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. హాస్టల్లో మిగిలిన విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండమన్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సవిత ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
బీసీలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గుర్తించడంతో పాటు... పోటీ పరీక్షల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందజేసినందుకు గానూ సోషల్ జస్టిస్ సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్కోచ్ అవార్డును ప్రకటించింది. ఈ క్రమంలో మంత్రి సవితకు ఢిల్లీలో ఈ స్కోచ్ అవార్డును అందజేశారు.
భవిష్యత్తులో బీసీ స్టడీ సర్కిళ్లు బలోపేతం చేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణతో ఉద్యోగాలు వచ్చేలా చేసినందుకు బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు వచ్చిందన్నారు.
వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలన, కూటమి ప్రభుత్వంపై భూమన కరుణాకర్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.