Home » Savitha
‘అభివృద్ధి, సంక్షేమం విషయంలో పెనుకొండ మా జాగీరే. మా తాత, మా నాన్న, నేను పుట్టింది ఇక్కడే. ఇది నా జాగీరే’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు.
అనకాపల్లి జిల్లా నక్కలపల్లిలో మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హోం మంత్రి వంగలపూడి అనిత కృషితో గురుకుల పాఠశాల మంజూరు అయ్యింది.
ఆదరణ పథకంలో భాగంగా రూ.1000 కోట్లు కేటాయిస్తున్నామని ఏపీ మంత్రి సవిత ప్రకటించారు. గతంలో ఆదరణ పథకంలో వస్తువులు ఇచ్చామని.. ఇప్పుడు ఆదరణ పథకం ద్వారా బీసీ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
విద్యతోనే పేదరికాన్ని అధిగమించొచ్చని ఏపీ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. కురుబలు విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని సూచించారు.
ఏడారిగా ఉన్న రాయలసీమను సస్యశ్యామలం చేసిన భగీరథుడు సీఎం చంద్రబాబు అని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. రాయలసీమలోనూ ఆక్వా కల్చర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం సహకరిస్తోందని పేర్కొన్నారు.
సేంద్రియ వ్యవసాయం పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందని మంత్రి సవిత తెలిపారు. క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు సేంద్రియ ఆహారం అవసరమని చెప్పుకొచ్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు చంద్రబాబు వస్తే జాబు... జగనొస్తే చావేనని విమర్శించారు.
పార్లమెంటులో మహిళా బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. మన స్త్రీ శక్తికి మరింత బలం ఇవ్వాలని చూస్తే దానికి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి.
లేపాక్షి షోరూమ్లు, హస్తకళారూపాల విక్రయాలపై మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. లేపాక్షి షోరూమ్లకు నూతన హంగులు ఇవ్వాలని మంత్రి సవిత సూచించారు.
పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని మంత్రి సవిత తెలిపారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గించాలని ప్రజలకు సూచించారు.