Home » S Jaishankar
పాకిస్థాన్ నుంచి 2025 మేలో తాము స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నామని బలోచ్ నేత తమ లేఖలో గుర్తుచేశారు. 2026 మొదటి వారంలో '2026 బలోచిస్థాన్ గ్లోబల్ డిప్లొమాటిక్ వీక్'ను బలూచిస్థాన్ రిపబ్లిక్ జరుపుకోనున్నట్టు కూడా ఆయన ప్రకటించారు.
పొరుగుదేశాలతో నిర్మాణాత్మక సహకారానికి భారత్ కట్టుబడి ఉంటుందని, రెండ్రోజుల క్రితమే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా అంత్యక్రియలకు భారత్ ప్రతినిధిగా తాను ఢాకా వెళ్లాలని ఎస్ జైశంకర్ చెప్పారు.
బేగం ఖలీదా జియా (80) సుదీర్ఘ అస్వస్థతతో మంగళవారం ఉదయం 6 గంటలకు ఢాకా అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గుండె, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో నవంబర్ 23న ఆసుపత్రిలో చేరిన ఆమె 36 రోజులుగా చికిత్స పొందుతూ వచ్చారు.
ఆపరేషన్ సిందూర్పై మాట్లాడుతూ, భారత్ నిర్దిష్ట నియమాలు, నిబంధల కింద ఆపరేషన్ చేపట్టిందనని జైశంకర్ అన్నారు. ఎలాంటి చర్య తీసుకున్నా దేశానికి, దేశ ప్రజలకు, మీడియాకు, పౌర సమాజానికి జవాబుదారీగా నిలిచిందని చెప్పారు.
వాషింగ్టన్తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే వాస్తవరూపం దాల్చనుందని జైశంకర్ చెప్పారు. యూఎస్తో వాణిజ్యం అనేది చాలా ముఖ్యమైన అంశమని, సహేతుకలైన నిబంధనలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఆమిర్ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు. రాజధాని కాబుల్లో భారత రాయబార కార్యాలయం మళ్లీ..
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిలా విదేశాంగ విధానాన్ని ఇంత బహిరంగంగా నిర్వహించిన ఏ అధ్యక్షుడిని గతంలో చూడలేదని జైశంకర్ అన్నారు. వాణిజ్య అంశాలతో పాటు వాణిజ్యేతర వ్యవహారాలకు టారిఫ్లు వినియోగిస్తుండటం కొత్తగా ఉందని ఉన్నారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కో పర్యటన ఖరారైంది. ఈనెల 20-21 తేదీల్లో ఆయన మాస్కోలో పర్యటించనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టుగా నీరు, రక్తం కలిసి ప్రవహించవని జైశంకర్ పునరుద్ఘాటించారు. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం ద్వారా నెహ్రూ చేసిన తప్పిదాన్ని మోదీ ప్రభుత్వం సరిచేసిందన్నారు.
అమెరికా మధ్యవర్తిత్వంపై వస్తున్న ఊహాగానాలను జైశంకర్ కొట్టివేశారు. ఏప్రిల్ 22 జూన్ 17 మధ్య ప్రధానమంత్రి మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణలు జరగలేదని సభకు వివరించారు.