Home » Russia-Ukraine war
రష్యాలో అతిపెద్ద ఆన్లైన్ వాణిజ్య సంస్థ అయిన 'వైల్డ్బెర్రీస్'కు చెందిన పలు గిడ్డంగులపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ పరిణామం సంస్థ వ్యవస్థాపకురాలు, రష్యాలో అత్యంత సంపన్న మహిళగా పేరున్న టట్యానా కిమ్కు పెద్ద సవాలుగా మారింది.
రష్యాలోని తాతర్స్తాన్ ప్రాంతంలో ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో 12 మంది మరణించగా, 39 మంది గాయపడినట్టు రష్యా అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం.
ఉక్రెయిన్లో ఓ సామాన్య పౌరుడిని వెంటాడి దాడి చేసిన డ్రోన్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ఈ వీడియోను షేర్ చేశారు.
కాస్పియన్ సముద్రంలో తమ నౌకపై ఉక్రెయిన్ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్కు చెందిన వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ చేసిన దాడిలో ఒక నావికుడు మరణించగా, మరకొరు గాయపడ్డారు.
నల్ల సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక భారతీయ నావికుడు మరణించాడు. ఆ నౌకలో మొత్తం పది మంది సిబ్బంది ఉండగా, వారిలో ముగ్గురు భారతీయులు.
ఉక్రెయిన్లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చిన వేళ ఉక్రెయిన్ కీలక ప్రకటన చేసింది. తమ సముద్ర రేవులను కాపాడుకోవడానికి, ప్రపంచ ఆహార భద్రతకు భరోసా ఇస్తూ ధాన్యాల ఎగుమతులను కొనసాగించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పింది.
ఉక్రెయిన్ తాజాగా రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఏకంగా 660 డ్రోన్లను ప్రయోగించింది.
ఉక్రెయిన్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారత సైన్యాన్ని రంగంలోకి దించాలనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రతిపాదనను అధ్యక్షుడు ట్రంప్ నవ్వుతూ కొట్టిపారేశారని, భారతీయులు దేనికీ పైసా ఖర్చు పెట్టరు.. ఇలాంటి వాటికి అస్సలు డబ్బులు ఇవ్వరని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఓ కొత్త పుస్తకం వెల్లడించింది.
రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మరోసారి డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్కు చెందిన డ్రోన్లు మాస్కో వైపు దూసుకొస్తుండగా, రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి.