Home » Rishabh Pant
లఖ్నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. గతేడాది వేలంలో అతడిని లఖ్నవూ ఫ్రాంచైజీ రూ.27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. తాను పొందిన భారీ ధరకు పంత్ ఏమాత్రం న్యాయం చేయట్లేదంటూ సోషల్ మీడియలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎల్ఎస్జీ కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్నవూ సూపర్ జెయింట్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. నిన్న వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమిపై లఖ్నవూ కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు.
ఐపీఎల్ 2026లో ఏకానా స్టేడియం వేదికగా లఖ్నవూ సూపర్ జెయింట్స్తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో కోల్కతా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఇక తమ ఓటమిపై ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు.
ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఆఖరి బంతి వరకు పోరాడి 3 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే జట్టు గెలిచినప్పటికీ ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ ఘాటుగా స్పందించాడు.
ఐపీఎల్ 2026లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓడిన ఎల్ఎస్జీ.. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్పై ఘన విజయం సాధించింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సారథ్యంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్ గతేడాది పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఫామ్లేమితో సతమతమవుతున్నా రిస్కీ షాట్లతో మూల్యం చెల్లించిన తీరుపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. దీంతో టీమిండియా స్టార్ బ్యాటర్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన ఫామ్పై దృష్టి పెట్టాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను అనుసరిస్తూ.. సూపర్ ఫిట్ అయ్యాడు.
ఐపీఎల్ 2026 నేపథ్యంలో టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ పర్యవేక్షణలో ముంబైలో స్టార్ బ్యాటర్ పంత్ ప్రాక్టీస్ చేశాడు. ఇద్దరూ కలిసి నాలుగు రోజుల పాటు బ్రబౌర్న్ స్టేడియంలో ప్రాక్టీస్లో పాల్గొన్నారు. యువీ.. పంత్కు బ్యాటింగ్లో కీలకమైన సూచనలు చేశాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరం అని అభిప్రాయపడ్డాడు. నేటి యువతకు పలు సూచనలు చేశాడు.
జనవరి 21 నుంచి న్యూజిలాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కివీస్తో తొలి వన్డేలో వాషీ గాయపడిన సంగతి తెలిసిందే.