Home » Revanth Reddy
శంషాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్లో ఏర్పాటు చేసిన.. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. శంకర్ గౌడ్ అమరుడైన రోజును ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. వారిపై చర్యలు తీసుకునే దమ్ములేక తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె, కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది.
వివిధ వేదికలపై ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) వేగంగా అమల్లోకి వచ్చేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ, అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. అక్షరాస్యత పెంపు నుంచి బోధనా నాణ్యత వరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలంగాణ విద్యా వ్యవస్థలో కొత్త విప్లవానికి నాంది పలికాయి.
కేంద్ర జల్శక్తి మంత్రికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్పై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును మరో రెండు వారాల తర్వాత విచారిస్తామని తెలిపింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణ హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసిందని తెలిపారు.
కాళేశ్వరం అవినీతి విచారణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలమైందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం అవకతవకలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.