Home » Rayadurg
పట్టణాన్ని స్వచ్ఛతకు ప్రతిరూపంగా తీర్చిదిద్దాలంటే ప్రతిపౌరుడు పారిశుధ్య కార్మికుడిగా బా ధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. పట్ట ణంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పాత మున్సిపాలిటీ వద్ద ఆయన ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీ బడుగు, బ లహీన వర్గాల పార్టీ అని, కష్టపడే కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ పెద్ద పీట ఉంటుందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. మండలంలోని గోవిందవాడ గ్రామంలో గురు వారం నిర్వహించిన టీడీపీ మండల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు.
మండలంలోని డీ కొండాపురం గ్రామంలో తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మహిళలు వాపోతున్నారు. ప్రతి రోజూ కొళాయి లకు ఐదు లేదా పది నిమిషాలు తాగునీరు వదిలితే ఒక్కొక్క ఇంటికి ఒక బిందె కంటె ఎక్కువ నీరు దొరకడం లేదంటున్నారు.
పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి న 14 మంది విద్యార్థులకు బుధవారం కళ్లీమఠం ము న్సిపల్ హైస్కూల్లో ఎస్ ఎంసీ చైర్మన పార్వతి, వైస్ చైౖర్మన డి. సత్యనారాయ ణ సన్మానించారు. పాఠశాలలో 500 పైగా మార్కులు సాధించిన 14 మంది విద్యార్థుల ఫ్లెక్సీలు వేయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కురుబ కుల స్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి డిమాండ్లను నెర వేర్చాలని బీసీ కమిషన చైర్మన శ్రీరాజీవ్ రంజనమిశ్రాను కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే మల్లికార్జున కోరారు.
నియోజకవర్గంలో ఈ ఏడాది రబీసీజనలో 1.15 లక్షల ఎకరాల దాకా సాగునీటితో రైతులు వరిపంట సాగుచేశారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అధిక ది గుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం మండలంలోని కలుగోడు గ్రామంలో బీటీపీ సాగునీటితో పండిస్తున్న వరి పంట పొలాలను పరిశీలించారు.
పట్టణంలోని ప్రసిద్ధి చెందిన ప్రసన్న వెంకట రమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మ యూరవాహనంపై శ్రీవా రు భక్తుల కు దర్శనమి చ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామివారి ఉత్సవ విగ్రహాలను సా యంత్రం మయూర వా హనంపై కొలువుదీర్చి దేవాలయం వద్ద నుంచి వినాయక సర్కిల్ మీదు గా నేసేపేట వరకు ఊరేగించారు.
నియోజకవర్గంలో రూ. 17 కోట్ల వ్యయంతో గ్రామీణ, అంతర్ రాష్ట్ర రహదారుల మరమ్మతు పను లు చేపట్టామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. మండల కేంద్రంలో శనివారం రూ. 6కోట్లతో చేపట్టిన గుండ్లపల్లి- బళ్లారి జాతీయ రహదారి మరమ్మతు పనులకు ఆయన భూమి పూజ చేశారు.
పట్టణంలోని ప్రసిద్ధి చెందిన ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవా రం శ్రీవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
పట్టణంలోని ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మరథోత్సవం గురువారం సాయంత్రం కన్నుల పండువగా సాగింది. స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయా న్నే మొలకాల్మూరు రోడ్డులో భక్తిశ్రద్ధలతో హోమాన్ని నిర్వహించి మడుగు తేరును లాగారు.