Home » Rayadurg
సామాజిక పింఛన పే దలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పే ర్కొన్నారు. పట్టణంలో బుధవారం నిర్వహించిన ఇంటి వద్దకే పిం ఛన పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకటో తేదీన ఉదయాన్నే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానిదే అన్నారు.
మండలంలోని శ్రీధరఘ ట్ట, ఉంతకల్లు తదితర గ్రామాల్లో ఏరువాక పౌర్ణమి వేడుకలను సోమ వారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే రైతులు తమ ఎద్దు లను కడిగా, కొమ్ములకు రంగులు వేసి, మెడలో గంటలు, పూలమాల లతో అలంకరించి పూజలు చేశారు.
సమాజంలో అందరి సమిష్టి కృషితో పోలియో మహమ్మారిని నిర్మూలిద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈబీ దేవి వైద్యశాఖ అధికారులకు సూచిం చారు. జాతీయ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆమె సోమవారం పట్టణంలోని శాంతినగర్ అర్బన హెల్త్ సెంటర్ను ఆక స్మి కంగా తనిఖీ చేశారు.
గ్రా మా లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం అందించిన చెత్త సేకరణ బండ్లు చెత్తకుప్పలోకి చేరాయి. డి. హీరేహాళ్ మండలంలోని సోమలా పురం, మురడి గ్రామాల్లో ఇంటింటికీ చెత్త సేకరించాల్సిన ఈ బండ్లు వినియోగానికి నోచుకోకుండా చెట్ల కింద, భవనాల పక్కన పడేశారు.
ప్రజల సౌకర్యార్థం చేపట్టిన బస్సు షెల్టర్ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో నేమకల్లు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయ ణ రూ. 5 లక్షలు మంజూరు చేయగా దాదాపు మూడు నెలల క్రితం పనులు ప్రారంభించారు.
టీడీపీని అప్రతిష్టపాలు చేయటానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ పార్టీల ముసుగులో ఉన్న కొంతమంది టీడీపీకి ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయ ని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు.
2003 డీఎస్సీ ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వ ఓపీఎస్ను అమలు చేయడంతో డీఎస్సీ ఉపాధ్యాయ పోరం నా యకులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాల యం వద్ద నుంచి లక్ష్మీబజార్, పాతబస్టాండ్, వినాయకసర్కిల్ వర కు సీఎం సార్ థ్యాంక్యూ అంటూ నినాదాలు చేస్తూ బుధవారం ర్యా లీ నిర్వహించారు.
ఆర్టీసీ ఉద్యోగుల స మస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్ష ణమే పరిష్కరించాలని ఆర్టీసీ జే ఏసీ నాయకులు డిమాండ్ చేశా రు. రాష్ట్ర నాయకుల పిలుపుమేర కు వారు మంగళవారం ఆర్టీసీ డి పోల వద్ద నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత బస్సుల ను ఆర్టీసీ ద్వారా ప్రభుత్వం నిర్వహించాలన్నారు.
వ్యవసాయంలో రైతులను అన్ని విధాలా ఆదుకోవడంలో సీఎం చంద్ర బాబునాయుడు ముందుంటారని, రైతుల పక్షపాతి అని ప్రభుత్వ విప్ కాలవ శ్రీని వాసు లు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని శనివారం మండ లంలోని కెంచానపలిలో వ్యవసాయ శాఖ ఏడీ పద్మజ ఆధ్వర్యం లో నిర్వహించారు.
పట్టణం లోని బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో నూతనంగా నిర్మించిన ఆల యంలో వల్లీదేవసేన సమే త న్రాగ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ఠను శని వారం ఘనంగా నిర్వహిం చారు.