Home » Rajamahendravaram
రాజమండ్రి కల్తీ పాల కేసులో నిందితుడు అడ్డాల గణేష్ను త్రీ టౌన్ పోలీసులు మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది..
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై విచారణ అధికారి కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ విచారణ చేపట్టారు. పాల వ్యాపారి అడ్డాల గణేష్ నిర్వహిస్తున్న వరలక్ష్మి డెయిరీని సీజ్ చేశారు..
కల్తీ పాల ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలు, నూనెలు, ఇతర వాటి సేకరణ ఎంతవరకు జరిగింది? ఫలితాలు ఎలా ఉన్నాయి? అని అడిగి తెలుసుకున్నారు.
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. మృతులు కృష్ణవేణి, రాధాకృష్ణ, శేషగిరిరావు, రమణిల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు..
రాజమండ్రి పరిసర గ్రామాల్లో పెద్ద పులి హడలెత్తిస్తోంది. రోజుకో ప్రాంతం తిరుగుతూ అక్కడి ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. తాజాగా.. రాజనగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో తెల్లవారుజామున పెద్ద పులి ఆవుపై దాడిచేసి చంపేసింది. దీంతో గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
రాజమండ్రిలో పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. పెద్ద పులి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఓ చోట పెద్దపులి తిరుగుతుండగా కారులో నుంచి కొంతమంది యువకులు వీడియో తీశారు..
మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చిన పులులు అలజడి సృష్టిస్తున్నాయి. మొన్నటి వరకు ఏలూరు జిల్లా ఏజెన్సీని వణికించిన పెద్దపులి.. ఇప్పుడు తూర్పు గోదావరిలోకి ప్రవేశించింది.
గ్రామాల్లో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ముందుగా గ్రామ సభల్లో తీర్మానం చేయాలని బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సూచించారు. తాజాగా ఉపాధి హామీ చట్ట సవరణ ద్వారా 15 రోజుల్లోగా కూలి చెల్లించకుంటే జరిమానాతో కలిపి లబ్ధిదారుడికి అందజేస్తామని స్పష్టం చేశారు. విపత్తుల సమయంలోనూ రైతులను, సాధారణ ప్రజలను ఆదుకునేందుకు ఈ నిధులు వినియోగించుకోవచ్చని వివరించారు.
ఐటీ పెట్టుబడులు, యువత ఉద్యోగాలపై జగన్ అండ్ కో కుట్ర చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. యువత భవిష్యత్పై ద్వేషంతోనే జగన్ ఈ పని చేస్తున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వాసుపత్రుల్లో కాలం చెల్లిన మందులను ఇస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు చేపట్టిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి వచ్చిన మందులను ఆన్లైన్ చేయకుండా ఆఫ్లైన్లో