Home » Rain Alert
తెలంగాణ వ్యాప్తంగా 2,463 గ్రామాలు వర్షాలకు ప్రభావితం అయ్యాయని.. 2,20,443 ఎకరాలు దెబ్బతిన్నాయని నివేదిక తెలిపింది. ఏకంగా 1,43,304 మంది రైతులు వానలకు నష్టపోయారని పేర్కొంది. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా పంట నష్టం జరిగిందని ప్రభుత్వం తెలిపింది.
పోర్టుల నుండి ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్ నగర్, గజ్వెల్ ప్రాంతాలకు యూరియా చేరుకోనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి డిమాండ్ పరంగా జిల్లాలకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
ఐదుగురు వ్యక్తులు మానేరులో చిక్కుకుపోయారు. దీంతో వారిని రక్షించడానికి రెస్క్యూ బృందం ఎంత ప్రయత్నం చేసిన ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయత్నాలు విఫలమయ్యాయి. చూస్తుండగానే.. 30 గంటలు గడిచిపోయాయి.
జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో జియాగూడ 100 ఫీట్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆ రోడ్డును అధికారులు మూసివేశారు. జియాగూడ - పురానాపూల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం రామచందర్ రావు కామారెడ్డికి వెళ్లనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులకు బీజేపీ అండగా ఉండనుందని భరోసా ఇవ్వనున్నారు.
ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు.. ఆగకుండా ఒకటే వాన.. కుంభవృష్టి! కామారెడ్డి, మెదక్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలో కుండపోతగా కురిసిన వానకు చెరువులు నిండి కట్టలు తెగాయి. వంతెనలు కూలాయి.
మెదక్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 30.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. హావేలిఘనాపూర్ మండలం సర్దనలో 30 సెంటీమీటర్ల కుండపోత వాన కురిసింది. నాగపూర్లో 27 సెం. మీ వర్షపాతం నమోదైంది. చేగుంటలో 22 సెం.మీ, రామయంపేట మండలంలో 20 సెం. మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానాకి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జమ్మూ కశ్మీర్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్లు, ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఇవాళ(బుధవారం) భారీ వర్షాలు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.