Home » Rain Alert
ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉద్ధృతి పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులకు వరద తీవ్రంగా ప్రవహిస్తోందని తెలిపారు.
విశాఖలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో.. పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు, హోర్డింగ్స్ నేలకొరిగాయి. రహదారులు జలమయం అయ్యాయి.
విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది. ముప్పు ప్రాంతాల వైపు రాకపోకలు నిలిపివేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ముసరాంబాగ్ దగ్గర మూసీ నదిపై నిర్మిస్తున్న కొత్త వంతెన మూసి ఉద్ధృతికి దెబ్బతిందన్న వార్తలు సోషిల్ మీడియాలో, మీడియా ఛానల్స్లో ప్రచురితం అయ్యాయి.
ఈ రోజు (శనివారం) కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది. అవసరం అయితే తప్ప బయటకు రాకూడదని స్పష్టం చేసింది. ఇక, హైదరాబాద్ మహా నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. వర్షాలపై నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు.
హైదరాబాద్ సిటీలోని ప్రజలు ప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి అధికారులు సూచిస్తున్నారు. మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్. మరికాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ అధికారులు ప్రకటించారు. సరిగ్గా రాత్రి 8 గంటల నుంచి 10 మధ్య వర్షం దంచికొట్టనుందని తెలిపారు. ముఖ్యంగా నగరం పరిధిలోని..