Home » Rain Alert
రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అకాల వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు ఎలాంటి నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
జిల్లాలో అకాల వర్షం భారీగా కురిసింది. శుక్రవారం వేకువజామున ఓవైపు ఉరుములు, మెరుపులతో వర్షం కురవగా.. మరోవైపు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉదయం 8 గంటల తర్వాత ఎండకాచినా.. మధ్యాహ్నం 3 గంటల నుంచి మళ్లీ వాతావరణం మారిపోయింది.
ఎండ తీవ్రతతో అల్లాడితున్న నగరవాసులకు ఉపశమనం కలిగించేలా శుక్రవారం వర్షం కురిసింది. గురువారం అర్ధరాత్రి ఆకాశం మేఘావృతమై అనేకచోట్ల జల్లులు కురిశాయి.
తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఎండ దంచికొట్టింది. తర్వాతి నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం చల్లబడిపోయింది.
ఏపీలోని పలు జిల్లాల్లో వాతావరణం వేగంగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాబోయే మూడు గంటల వ్యవధిలో పిడుగులు, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలోని ములుగు జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలులు తీవ్ర ప్రభావం చూపించాయి. పలుచోట్ల వడగళ్ల వాన కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో సోమవారం నాడు ద్రోణి ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు అకాల వర్షాలు.. ఇలా విభిన్న వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.
తెలంగాణలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బలమైన ఎల్-నినో ప్రభావం, పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) పరిస్థితుల కారణంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ ట్వీట్ చేసింది.