Home » Rahul Gandhi
రాహుల్ మంగళవారంనాడు కోర్టు ముందు హాజరుకాగా, గతంలో ఐదు పర్యాయాలు ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. 2020లో భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణల సమయంలో భారత సైనికుల మనోభావాలను దెబ్బతీసేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాత్సవ ఈ పిటిషన్ వేశారు.
అభినవ్ భారత్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడైన పంకజ్ కుముద్చంద్ర ఫడ్నిస్ ఈ పిటిషన్ వేశారు. తాను సావర్కర్ గురించి రీసెర్చ్ చేసినట్టు ఆయన తెలిపారు. సావర్కర్ గురించి రాహుల్ ఏ మాత్రం పరిపక్వత, బాధ్యతలేకుండా మాట్లాడుతున్నందున ఆయనను తన పిటిషన్ కాపీ చదివేలా ఆదేశించాలని కోర్టును కోరారు.
తమ కుమార్తె జయరెడ్డి వివాహం వచ్చే నెల 7న జరగనుందని, ఆ కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు.
మనీ లాండరింగ్కు ఇదొక 'క్లాసికల్ ఎగ్జాంపుల్' అంటూ ఈడీ ఇంతకుముందు పేర్కొంది. కాంగ్రెస్ అగ్రనేతలు రూ.2,000 కోట్ల మేరకు నేరపూరిత కుట్ర, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ వివాదానికి కీలకంగా ఉంది.
దేశ చరిత్రలో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉద్ఘాటించారు. బీసీల పట్ల బీఆర్ఎస్కి చిత్త శుద్ధి లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉందని నొక్కిచెప్పారు. బీసీ రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్నే అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
మహారాష్ట్రలో మాదిరిగా బిహార్లోనూ ఎన్నికల హైజాక్కు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మరోసారి ఆరోపించారు.
భువనేశ్వర్లో శుక్రవారంనాడు జరిగిన 'సంవిధాన్ బచావో సమావేశ్'లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బీజేపీ వింగ్గా ఈసీఐ పని చేస్తోందని అన్నారు.
వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా తన నివాసం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. ఖేమ్కా కారు దిగుతుండగా బైక్పై వచ్చిన అగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఖేమ్కా మృతి చెందారు. ఖేమ్కాకు మగధ్ ఆసుపత్రి, పలు పెట్రోల్ పంప్లు ఉన్నాయి.
తొంభై కోట్ల రూపాయల అప్పును సాకుగా చూపి.. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2 వేల కోట్ల ఆస్తులను కాజేసేందుకు సోనియాగాంధీ, రాహుల్గాంధీ కుట్రపన్నారని ఈడీ ఆరోపించింది.
స్వాతంత్య్రానికి పూర్వం కాంగ్రెస్ పార్టీ.. తన భావాలను ప్రతిబింబించే విధంగా ఒక పత్రికను ప్రారంభించాలని భావించింది. ఈ ఉద్దేశ్యంతో 1938లో ది నేషనల్ హెరాల్డ్ పత్రికను జవహర్ లాల్ నెహ్రు ప్రారంభించారు. దీనికి అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ప్రచురణకర్తగా వ్యవహరించింది.